Heritage Issue: ప్రభుత్వాన్ని ఇరికించిన 'హెరిటేజ్'
Heritage Issue: ప్రభుత్వాన్ని ఇరికించిన 'హెరిటేజ్'

హెరిటేజ్ పెరుగులో కల్తీ జరిగింది అంటూ ఇటీవల ఒక వార్త చూశాం. గుర్గాంలో హెరిటేజ్ సంస్థకు సంబంధించిన పెరుగుని టెస్ట్ చేసినప్పుడు ఎఫ్ఎస్ఎస్ఐ నిబంధనల ప్రకారం అది లేదు అని వార్తలు వచ్చాయి. ఈ మేరకు హెరిటేజ్కి లక్ష రూపాయల జరిమానా వేశారు. ఈ జరిమానాకు సంబంధించిన వార్త, హెరిటేజ్ కి సంబంధించిన పెరుగులో కల్తీ జరిగిందనే వార్తలు బయటికి వచ్చాయి. ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన కొన్ని పత్రికల్లో దీనికి సంబంధించిన కథనాలు కూడా వచ్చాయి. అయితే ఈ కథనాల మీద హెరిటేజ్ ట్విట్టర్లో స్పందించింది. హెరిటేజ్ ఏం చెప్తోంది అంటే, హెరిటేజ్ ఇది నిరాధారమైన వార్తలు, వాటిని నమ్మొద్దు, మేము దాదాపు 30 సంవత్సరాలుగా ఈ ఫీల్డ్ లో ఉన్నాం, చాలా క్వాలిటీతో కూడిన డైరీ ప్రొడక్ట్స్ ని మేము అందుబాటులోకి తెస్తున్నాం. ఇప్పటివరకు ఇటువంటి ఏ సందర్భంలో కూడా కల్తి జరగడమో, లేకపోతే నాణ్యత లేకపోవడమో లేదు, కాబట్టి వీటిని నమ్మాల్సిన అవసరం లేదు అని చెప్తోంది. ఈ లక్ష రూపాయల జరిమానా అంశంపైన మేము కోర్టు కి వెళ్ళాం. అపీల్ చేశాం ట్రిబ్యునల్లో దానికి సంబంధించి స్టే కూడా ఉంది మాకు అని హెరిటేజ్ చెప్తుంది. ఈ సందర్భంగా హెరిటేజ్ సంస్థ రిలీజ్ చేసినట్టు ట్విట్టర్లో పెట్టిన ఈ పోస్ట్ కి సంబంధించి నేను ఒక రెండు మూడు లైన్స్ చదువుతాను.


