ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్‌కు కవిత రాసిన లేఖ తాలుకా టెన్షన్‌ వాతావరణం ఏర్పడింది.

ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్‌కు కవిత రాసిన లేఖ తాలుకా టెన్షన్‌ వాతావరణం ఏర్పడింది. లేఖ తర్వాత తెలుగుదేశం పార్టీ(TDP)కి చెందిన మీడియా అనేక కథనాలు రాశారు. కాంగ్రెస్‌(Congress)లో చేరుతారని వార్తలు రాశారు. ఆ వార్తలను ఆమె అవన్నీ తప్పుడు, ఫేక్‌ అంటూ కొట్టిపారేశారు. అయితే లేఖ రాయడంతో పార్టీ లైన్‌ను కవిత దాటారని కేటీఆర్‌ (KTR)అభిప్రాయపడ్డారు. ఏమైనా ఉంటే పార్టీ ఫోరంలో మాట్లాడాలన్నారు. పార్టీలో ఉన్న ఎవరికైనా ఇది వర్తిస్తుందన్నారు. పార్టీ లైన్‌ ప్రకారమే మాట్లాడాలన్నారు. ఆ తర్వాత ఒకటి, రెండు సార్ల పబ్లిక్‌ ఇష్యూలపై ఆమె స్పందించారు. కేటీఆర్‌కు ఏసీబీ (ACB)ఇచ్చిన నోటీసులపై స్పందించారు. ప్రభుత్వం భయపడుతోందని, లేఖలకు, విచారణలకు కేసీఆర్‌(KCR) సైనికులు ఎవరూ భయపడరన్నారు. దీంతో ఈ ఇష్యూ క్లోజ్‌ అయిందని అందరూ అనుకున్నారు. కానీ ఈరోజు కవిత మీడియాతో చిట్‌చాట్‌లో చాలా విషయాలు మాట్లాడారు. ఎయిర్‌పోర్టు దగ్గర ఆమె మాట్లాడిన మాటలకు బీఆర్‌ఎస్ అధిష్టానం స్పందిస్తుందని, లేదా నోటీసులు ఇస్తుందనుకున్నారు. కానీ బీఆర్‌ఎస్‌ (BRS)నుంచి అలాంటి చర్యలు ఏవీ లేవు. అయితే ఈరోజు చిట్‌చాట్‌లో ఆమె సంచలన విషయాలు మాట్లాడారు. అసలు కవిత వ్యూహమేంటి.. ఈ అంశంపై సీనియర్ జర్నలిస్ట్ 'YNR' విశ్లేషణ..!



ehatv

ehatv

Next Story