Jagan’s: అమరవాతిపై జగన్ మాస్టర్ స్ట్రోక్

ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశానికి సంబంధించి ఈరోజు ఒక కీలకమైన రోజుగా చూడాలి. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిగా చట్టబద్ధత కల్పిస్తూ లోక్సభలో చర్చ జరిగింది. లోక్సభ ఆమోదం తెలిపింది, రేపు రాజ్యసభలో కూడా ఆమోదం పొందబోతుంది. లాంచన ప్రాయంగానే ఉంది అయితే ఈ మొత్తం వ్యవహారంలో చంద్రబాబు కోణం ఏంటి, జగన్మోహన్ రెడ్డి కోణం ఏంటి అనేది పక్కన పెట్టి, ప్రజల కోణం ఏంటి అనే దానిలో దాని దృష్టిలో ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. అమరావతి అంశానికి సంబంధించి, చంద్రబాబు అమరావతి అంశానికి సంబంధించి, జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పుల కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు భవిష్యత్తులోనూ, ప్రస్తుతం ఇబ్బందుల్ని ఫేస్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఏంటి చంద్రబాబు అమరావతి విషయంలో చేసిన తప్పు, మాట్లాడదాం తర్వాత, జగన్మోహన్ రెడ్డి తప్పు చేసిన తప్పులు ఏంటో చూద్దాం, ఇప్పుడు ప్రెస్ కాన్ఫరెన్స్ లో జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన అంశాల గురించి చర్చిద్దాం. ఈ వీడియో కొంచెం లెన్తీగా ఉంటుంది బట్ నా ఒపీనియన్ ని ఈ ఇద్దరు నాయకుల పైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన రాజధాని అంశం పైన కొంచెం డీటెయిల్డ్ గా చెప్పడంలో భాగంగా లెన్తీ వీడియో చేస్తున్నా.
చంద్రబాబు చేసిన తప్పు ఏంటి అంటే, చంద్రబాబు శివరామకృష్ణన్ కమిటీ సూచనలు పక్కన పెట్టి, అమరావతి ప్రాంతాన్ని రాజధానిగా ఎంపిక చేయడంలో తప్పు చేశారు అనేది కచ్చితంగా అందరూ అంగీకరించాల్సిన విషయం. ఎందుకు తప్పు చేశారు, అందరూ యాక్సెప్ట్ చేశారు కదా, ఆ రోజు అందరూ ఒప్పుకున్నారు, ఎక్కడైనా పర్వాలేదు, అందరూ ఒప్పుకున్నారు, విజయవాడలో సెంట్రల్ లో ఎక్కడైనా రాజధాని ఉండాలంటే ఒప్పుకున్నారు కానీ, అమరావతి ప్రాంతం, ఆ పర్టికులర్ ఏరియా భారీ భవనాలు నిర్మించడానికి గానీ, ఇండస్ట్రీస్ అక్కడ రావడానికి గాని అనుకూలంగా ఉండే ప్రాంతం కాదు, అమరావతికి నాలాంటి వాళ్ళంతా మద్దతు ఇస్తూ వచ్చాం, ఇప్పటికీ కూడా అమరావతి రాజధానిగా ఉండాల్సిందే లేని చెప్తూ వస్తున్నాం, ఎందుకు వస్తున్నామంటే అక్కడ భూములు ఇచ్చిన రైతులకు జగన్మోహన్ రెడ్డి అన్యాయం చేశారు లాంటి ఒక ఒపీనియన్ డెవలప్ అయింది కాబట్టి, రైతులకు నష్టం జరగకూడదు అనే కోణంలోనే అమరావతికి మద్దతు ఇస్తూ వస్తున్న వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. ఆ ప్రాంతంలో రాజధాని నిర్మాణానికి సంబంధించి ఖర్చు, మామూలు దానికంటే కనీసం 60- 70% ఎక్కువగా పెట్టాల్సి వస్తుంది అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భరించే పరిస్థితిలో లేదు అనే విషయాన్ని చంద్రబాబు గ్రహించలేకపోయారు. దాంతో పాటు రాజధాని నిర్మాణం అనేది భారతదేశ చరిత్రలో ఇప్పటి వరకు ఒక నగరాన్ని, కొత్తగా అనుకొని, ఒక ఐదేళ్లలోనో, 10 ఏళ్లలోనో, 15 ఏళ్లలోనో, 20 ఏళ్లలోనో నిర్మించిన వాడు ఎవడు లేడు, నిర్మించడం సాధ్యం కూడా కాదు అలాంటి దాన్ని, ఐదేళ్లలో నేను చేసేస్తాను, చేసేయడం మాత్రమే కాదు, అమరావతి ప్రాంతంలో రాజధాని కట్టి ,అక్కడ ఇంకా లక్ష కోట్లు నేను కొత్తగా సంపాదించేస్తాను, సెల్ఫ్ క్యాపిటల్, సెల్ఫ్ సస్టైన్డ్ క్యాపిటల్ అంటూ, చంద్రబాబు నాయుడు చెప్పిన మాటలన్నీ కూడా శుద్ధ అబద్ధాలని తేలిపోయింది. ఈరోజు రాజధాని ప్రాంతాన్ని నిర్ణయించిన తర్వాత, 10ఏళ్ల తర్వాత ఈరోజు చూస్తే, సెల్ఫ్ సస్టైన్ రాజధాని విషయం పక్కన పెడితే, భూములు ఇచ్చిన రైతులకు, వాళ్ళ ప్లాట్ ఎక్కడో చెప్పలేని పరిస్థితిలో ఉన్నాం, వాళ్ళకి ప్లాట్లు ఇచ్చిన దగ్గర రోడ్లు ఏంటో, కరెంట్ ఏంటో చెప్పలేని పరిస్థితిలో ఉన్నాం, వాళ్ళ ప్లాట్లకు విలువ లేదు అని చెప్పడానికి బ్యాంకులు, ఆ ప్లాట్లు పెట్టుకొని లోన్లు ఇచ్చే పరిస్థితిలో కూడా లేకపోవడం చూస్తున్నాం. ఒక రాజధానిని కొత్తగా నిర్మించాలి, ఒక లక్ష కోట్లో, రెండు లక్షల కోట్లో పెట్టండని చంద్రబాబు ఆలోచన చేయడం తప్పు. కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రానికి 10ఏళ్ల పాటు హైదరాబాద్ రాజధానిగా ఉండడానికి సంబంధించిన అవకాశం ఉన్నప్పటికీ, పనికి మాలిన రాజకీయ కారణాలతో హైదరాబాద్ ను వదిలేసి, హడావిడిగా విజయవాడకి వెళ్లి అప్పటికప్పుడు రాజధానికి సంబంధించిన ప్రస్తావన చేయవడం చంద్రబాబు తప్పు. 2024 వరకు హైదరాబాద్ లోనే ఉండి అమరావతి ప్రాంతమా, ఇంకో ప్రాంతమా ప్లేస్ అనుకొని అక్కడ పరిపాలన భవనాలు అసెంబ్లీ సెక్రటరియట్ అన్నీ నిర్మించుకున్న తర్వాత లాంచన ప్రాయంగా ప్రశాంతంగా అక్కడికి వెళ్ళఉంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నష్టం జరిగి ఉండేది కాదు, ఆ నష్టం జరగడానికి చంద్రబాబు కారణం, చంద్రబాబు హడావుడిగా ఇక్కడ రాజకీయ పరమైన ఇక్కడ రాజకీయాల్లో తెలంగాణ రాజకీయాల్లో వేలు పెట్టి చెయ్యి కాల్చుకొని పరిగెత్తి అక్కడ ఆంధ్రప్రదేశ్ ని కూడా పాడు చేశాడు. ఈ అంశంపై మరింత లోతైన విశ్లేషణ..


