Jagan's safety: ప్రమాదంలో జగన్ భద్రత..!

ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి భద్రత పట్ల ఆ పార్టీ ఆందోళన చెందుతోంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి భద్రత పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉంటోంది అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇటీవల కొన్ని పరామర్శలకు, కొన్ని చోట్ల రైతులను పరామర్శించేందుకు వెళ్తున్న సందర్భంగా, ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఏర్పాటు చేసిన భద్రతలో లోపాలు కనిపించాయి. ఆయనకు కేటాయించిన ఎస్కార్ట్ వాహనంలోనూ, జామర్ వాహనంలోనూ ఇబ్బందులు రావడం, ఆ వాహనాలు రోడ్డుపైనే ఆగిపోయిన పరిస్థితి రావడం కూడా గతంలో చూశాం. అంతేకాదు ఆయన వెళ్తున్న దారిలో పోలీసు బందోబస్తు కూడా సరిగ్గా ఇవ్వట్లేదు అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. రూట్ కు సంబంధించి కూడా అభ్యంతరాలను వ్యక్తం చేస్తుంది. ఇటీవల ఇబ్రహీంపట్నంలో మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపైన, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు దాడి చేసిన నేపథ్యంలో, జోగి రమేష్ ఇంటికి జగన్మోహన్ రెడ్డి వెళ్ళారు. జోగి రమేష్ ఇంటికి వెళ్ళడానికి సంబంధించిన రూట్ని మామూలుగా 15-16 కిలోమీటర్లో ఆయన ఇంటికి చేరుకోవడానికి సంబంధించిన అవకాశం ఉంటే, రకరకాల మార్గాల ద్వారా తిప్పి, దాదాపు మరొక 10- 15 కిలోమీటర్లు ఎక్కువ ట్రావెల్ చేయాల్సిన పరిస్థితిని ప్రభుత్వం కల్పించింది. అది కూడా చివరి నిమిషంలో. ప్రభుత్వం రూట్ మ్యాప్ని ఇచ్చింది ఆ రూట్ మ్యాప్ ప్రకారం, ప్రభుత్వం ఇచ్చిన రూట్ మ్యాప్ ప్రకారమే జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్లాల్సి వచ్చింది. సడన్ గా రూట్ మార్చేశారు అక్కడికి వెళ్ళిన తర్వాత, వెళ్ళిన దారిలో కాకుండా, మళ్ళీ రిటర్న్ లో ఇంకొక మార్గాన్ని ఇచ్చారు. ఆ రిటర్న్ లో జగన్మోహన్ రెడ్డి, జోగి రమేష్ ఇంటి దగ్గర నుంచి వెనక్కి వచ్చే మార్గానికి సంబంధించిన సమాచారాన్ని కూడా వైసీపీ నాయకులకు ఆలస్యంగా ఇచ్చారు. ఎక్కువగా రష్ ఉండే సాయంత్రం పూట, ఎక్కువగా రద్దీ ఉండే ప్రాంతం నుంచి జగన్మోహన్ రెడ్డి రిటర్న్ వెళ్ళడానికి సంబంధించి పోలీసులు ఆదేశించారు. ఆ మార్గంలోనే వెళ్ళాల్సి వచ్చింది. ఇవన్నీ చూస్తుంటే ఇంటెన్షనల్ గానే పోలీసులు, లేకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి భద్రత పట్ల నిర్లక్ష్యంగా వ్యవహిస్తుందా, నిర్లక్ష్యం వహిస్తుందా అలాంటి ఒక ఇంప్రెషన్ కలుగుతోంది. గతంలో కూడా అనేక సందర్భాల్లో, భద్రత వైఫల్యాలు కనిపించాయి. చాలా పెద్ద ఎత్తున జనాలు జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ వరకు రావడం కూడా చూస్తున్నాం. కాన్వాయిని కదలనీయకుండా జనం అడ్డుపడిన సందర్భాల్లో చాలా చోట్ల చూస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్లోని ఓ వాహనం ఢీకొని వ్యక్తి తర్వాత మరణించడం కూడా చూశాం. అంతేకాదు అనంతపురం వెళ్ళిన సందర్భంగా అనంతపురంలో హెలిపాడ్ వరకు కూడా జనాలంతా వచ్చేసి హెలిపాడ్ పైన దాడి చేసే పరిస్థితి, హెలిపాడ్ డామేజ్ అయిపోయి అక్కడ నుంచి రిటర్న్లో ఆయన హెలికాప్టర్లో కాకుండా బై రోడ్ వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. హెలికాప్టర్ లో ఒక వీఐపీ దిగుతున్న సందర్భంగా ఉండే మినిమం ప్రోటోకాల్ ని కూడా అక్కడ పోలీస్ అధికారులు పాటించలేదు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అప్పుడు ఆరోపించింది. ఆయన హెలికాప్టర్ దిగుతున్న సందర్భంగా, హెలికాప్టర్ చుట్టుపక్కలకి వందల మంది జనాలు అక్కడికి రావడం హెలికాప్టర్ డ్యామేజ్ అవ్వడం కూడా చూశాం. ఇవన్నిటి నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి భద్రత పట్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనుమానాలు అభ్యంతరాలను వ్యక్తం చేస్తోంది. ఈ అంశంపై సీనియర్ జర్నలిస్ట్ YNR విశ్లేషణ..!


