Justice: హెరిటేజ్కు ఓ న్యాయం.. శ్రీవారికి మరో న్యాయమా..!
Justice: హెరిటేజ్కు ఓ న్యాయం.. శ్రీవారికి మరో న్యాయమా..!
హెరిటేజ్ సంస్థ పెరుగుపైన ఫిర్యాదు, దానిపైన కంప్లైంట్ రావడం, కంప్లైంట్ వచ్చిన తర్వాత హెరిటేజ్ సంస్థకు లక్ష రూపాయలు జరిమానా వేయడం, జరిమానా వేసిన తర్వాత హెరిటేజ్ సంస్థ ఈ శాంపిల్ తీసిన సందర్భంగా ప్రోటోకాల్ పాటించలేదు, సరైన పద్ధతులు పాటించి ఈ శాంపిల్ తీయలేదు, కాబట్టి వచ్చిన ఫలితం పైన మాకు అనుమానాలు ఉన్నాయి అంటూ, ట్రిబ్యునల్ లో అప్పీల్ చేయడం ఇవన్నీ చూసాం. ఈ అంశానికి సంబంధించి, హెరిటేజ్ ఏ ప్రోటోకాల్ ప్రకారం అయితే టెస్టులు చేయాలని కోరుతోందో, ట్రిబ్యునల్ కి వెళ్ళిందో, కోర్టుకి వెళ్ళిందో, అదే తరహా పరిస్థితి తిరుమల లడ్డు అంశంలో కూడా ఉండాలి కదా, హెరిటేజ్ ఏమో ఇన్ టైంలో తీశారా లేదా లేకపోతే థర్డ్ పార్టీ సమక్షంలో ఈ శాంపిలింగ్ తీశారా, లేదా శాంపిలింగ్ తీసిన తర్వాత ఎంత సమయంలోపు టెస్ట్ చేశారు ఏంటి ఇవన్నీ అడుగుతుంది. మరి తిరుమల లడ్డు కల్తీ అంశానికి సంబంధించి అవన్నీ జరిగాయా లేదా, చూడకుండా జంతువుల కొవ్వు, పందికొవ్వు, ఆవుకొవ్వు ఎక్కువ కలిసిందని ముఖ్యమంత్రి ఎలా ప్రకటన చేశారు. ముఖ్యమంత్రి అవేవి చూడకుండా ప్రకటన చేశారు. హెరిటేజ్ ఏమో ఇవన్నీ చూడాలని చెప్తోంది కాబట్టి, హెరిటేజ్ ప్రభుత్వాన్ని ఇరికించినట్లయింది అని ఒక వీడియో చేశాను. నాలుగు రోజుల క్రితం నేను ఆ వీడియో Facebook నుంచి డిలీట్ చేయించారు, Facebook లో ఆ వీడియో పైన కంప్లైంట్ చేసి, ఇప్పుడు Facebook లో ఆ వీడియోని అందుబాటులో లేకుండా చేశారు, ఎవరు చేశారో చేసిన వాళ్ళకి తెలుసు, సో వాళ్ళు హెరిటేజ్ పైన, నేను హెరిటేజ్ ట్రిబ్యునల్లో వేసిన కంప్లైంట్ ఆధారంగా హెరిటేజ్ట్ ట్విట్టర్లో పెట్టిన పోస్ట్ ఆధారంగా వీడియో చేశాను. నేను హెరిటేజ్ చెప్పనిది చెప్పలేదు, హెరిటేజ్ చెప్పిన అంశాలను మాత్రమే మీ దృష్టికి తీసుకొచ్చాను, హెరిటేజ్ చెప్పింది ఇలా ఉంది. తిరుమల లడ్డు విషయంలో ప్రభుత్వం వ్యవహరించింది ఇలా ఉంది, భిన్నంగా ఉంది అని నేను కంపేర్ చేస్తూ వీడియో చేశా. ఆ వీడియో వల్ల హెరిటేజ్ కి నష్టం జరిగింది అనుకున్నారో, ప్రభుత్వానికి నష్టం జరిగింది అనుకున్నారో, ఫేస్బుక్ నుంచి ఆ వీడియోని లేకుండా చేశారు. హెరిటేజ్ గురించి నేను ఒక్క తప్పుడు మాట మాట్లాడకుండా ఉన్న ఫాక్ట్స్, మీరు చెప్పిన ఫాక్ట్స్ నే నేను చెప్తే, హెరిటేజ్ సంస్థకు నష్టం జరిగినట్టు భావించారు హెరిటేజ్ పైన దుష్ప్రచారంగా భావించారో తెలీదు, హెరిటేజ్ కి సంబంధించిన ఇమేజ్ పోతుంది అనుకున్నారో తెలీదు, ఇమ్మీడియట్ గా దాని పైన చాలా పెద్ద ఎత్తున రంగంలో దిగి, వీడియో లేకుండా చేశారు. youtubeలో ఇప్పటికీ అందుబాటులో ఉంది ఆ వీడియో 70 వేల మందికి పైగా ఆ వీడియోని చూశారు, facebook లో లక్ష మందికి పైగా చూశారు, ఆ వీడియోని లేకుండా చేశారు. హెరిటేజ్ కి ఒక చిన్న మాట అనని మాట తప్పుగా ఏం మాట్లాడలే, నేను హెరిటేజ్ చెప్పిందే చెప్పా, అయినప్పటికీ హెరిటేజ్ పైన దుష్ప్రచారం, ఇంకోటిగా భావించి ఆ వీడియో లేకుండా చేశారే. శ్రీవారికి సంబంధించిన లడ్డు అంశంలో ప్రోటోకాల్ పాటించారో లేదో తెలియకుండా, శాంపిల్ ఎప్పుడు తీశారో ఎప్పుడు పంపించారో తెలియకుండా థర్డ్ పార్టీ సమక్షంలో శాంపిల్ తీశారో లేదో తెలియకుండా, అసలు ఆ శాంపిల్ కి సంబంధించి సెకండ్ టైం మళ్ళీ, సెకండ్ ఒపీనియన్ తీసుకునే ప్రయత్నం కూడా లేకుండా, ఓ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి నేరుగా అటువంటి ఒక క్యాంపెయిన్ చేసి, శ్రీవారి లడ్డు పైన దుష్ప్రచారం చేసినప్పుడు, అక్కడ ప్రభుత్వానికో లేకపోతే టిటిడికో శ్రీ వారికో నష్టం జరిగినట్టు కదా. ఇక్కడ హెరిటేజ్ సంస్థకి నష్టం జరిగిందేమో బహుశా నా వీడియో వల్ల బట్, ముఖ్యమంత్రి ఇచ్చిన స్టేట్మెంట్ వల్ల కోట్లాది మంది శ్రీవారి భక్తుల మనోభవాలకు సంబంధించిన అంశం కదా, తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన ప్రసాదానికి సంబంధించిన అంశం కదా, తిరుమల తిరుపతి దేవస్థానంలో కొలువై ఉన్న శ్రీవారికి సంబంధించిన అంశం కదా, శ్రీవారికి నష్టం జరిగితే పర్వాలేదా, లడ్డు పైన దుష్ప్రచారం జరిగితే పర్వాలేదా, కోట్లాది మంది భక్తుల భక్తుల మనోభావాలు దెబ్బతింటే పర్వాలేదా, శ్రీవారు మాత్రం హెరిటేజ్ కి మాత్రమే నెట్వర్క్ ఉందా, శ్రీవారి పైన నేరుగా ముఖ్యమంత్రి ఒక తప్పుడు ఆరోపణ చేస్తే దానిపైన ఎవరు స్పందించరా? ఆ వీడియోలు అన్నిటిని మనమే ప్రమోట్ చేస్తామా? ఆ వీడియోలు అన్నిటిని మనమే మనమే గంటలు గంటలు డిబేట్లు పెట్టి, పేజీలకి పేజీలు వార్తలు రాసి ప్రమోట్ చేస్తామా, హెరిటేజ్ చెప్పింది నేను చెప్తే మాత్రం వీడియోస్ అందుబాటులో ఉండకూడదా. ఈ అంశంపై పూర్తి విశ్లేషణ..!


