దశాబ్దకాలంగా కాళేశ్వరం ప్రాజెక్టు గురించి తెలంగాణ రాజకీయాల్లో జరుగుతున్న చర్చ చూశాం.

దశాబ్దకాలంగా కాళేశ్వరం ప్రాజెక్టు గురించి తెలంగాణ రాజకీయాల్లో జరుగుతున్న చర్చ చూశాం. కాళేశ్వరం (Kaleshwaram)అద్భుతమైన ప్రాజెక్టు అని బీఆర్‌ఎస్‌ (BRS)చెప్తూ వస్తోంది. ప్రతిపక్షాలేమో ఇది అవినీతి ప్రాజెక్టు అని, ఇది నిరర్దక ప్రాజెక్టు అని వాదిస్తూ వచ్చారు. ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్‌(Congress), కమ్యూనిస్టులు, బీజేపీ(BJP) కూడా ఈ ప్రాజెక్టుపై విమర్శలు చేస్తూ వస్తున్నాయి. దశాబ్దం తర్వాత తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ కోసం కమిషన్‌ను ఏర్పాటు చేశారు. ఎన్నికల కంటే ముందు కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజ్‌(Medigadda Project)లో ఉన్న 80 పిల్లర్లలో ఒక పిల్లర్‌లో క్రాక్స్‌ వచ్చాయి, దాని ప్రభావం పక్క పిల్లర్‌పై కూడా పడింది. దీంతో వెంటనే ఎన్‌డీఎస్‌ఏ(NDSA) రంగంలోకి దిగింది. ప్రాజెక్టు నాణ్యతపై గంటల్లోపే నివేదిక ఇచ్చింది. ఆ తర్వాత మరోసారి నివేదిక ఇచ్చింది. ఈ నివేదికలో పిల్లర్‌ ఎలా కుంగిందో చెప్పింది కానీ పిల్లర్‌ కుంగడానికి కారకులెవరనేది స్పష్టం చేయలేదు. నాణ్యతా లోపాలు, అవినీతి జరిగిందంటూ కాంగ్రెస్‌ ప్రభుత్వం జస్టిస్ పీసీ ఘోష్‌ (Pc ghosh)ఆధ్వర్యంలో ఓ కమిషన్‌ ఏర్పాటు చేసింది. ఎన్‌డీఎస్‌ఏ తుది నివేదిక ఇచ్చిన తర్వాత ఎల్‌ అండ్‌ టీ(L&T) సంస్థ ఈ నివేదికను తిరస్కరించింది. అయితే కమిషన్‌ కాలపరిమితి ముగిసినా కూడా మరో ముగ్గురికి నోటీసులు ఇచ్చి విచారణకు రావాలంటే గడువు పెంచింది. అప్పటి ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్‌(Etla Rajendar), అప్పటి ఇరిగేషన్ మంత్రి హరీష్‌రావు(Harish Rao), అప్పటి సీఎం కేసీఆర్‌(KCR)ను కమిషన్‌ విచారించింది. ఇంత చేసినా ప్రభుత్వం కాళేశ్వరంలో జరిగిన అవినీతిని నిరూపించలేకపోయింది. లక్ష కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించిన కాంగ్రెస్‌.. అసలు ఖర్చు చేసిందే 90 వేల కోట్లని.. అందులో లక్ష కోట్ల అవినీతి ఎలా జరుగుతుందనే వాదనతో కాంగ్రెస్‌ పార్టీ చేసి ఆరోపణలకు శాంటిటి లేకుండా పోయింది. అయితే ఇప్పుడు కాళేశ్వరంపై కేబినెట్‌ మినిట్స్‌ అందించాలని కమిషన్‌ కోరింది. ఇదే అంశంపై ఈ అంశంపై సీనియర్ జర్నలిస్ట్ 'YNR' విశ్లేషణ..!

ehatv

ehatv

Next Story