పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఉలవపాడు మండలం కరేడు గ్రామంలో నిన్న చాలా పెద్ద ఎత్తున రైతులు ఆందోళన చేశారు.

పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఉలవపాడు మండలం కరేడు గ్రామంలో నిన్న చాలా పెద్ద ఎత్తున రైతులు ఆందోళన చేశారు. కరేడు అనే గ్రామాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చిత్రపటంలో లేకుండా చేయాలని నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ (Andhra pradesh)రాష్ట్ర ప్రభుత్వం కరేడు అనే గ్రామానికి సంబంధించిన దాదాపు 8300 ఎకరాలకు పైగా భూమిని ఓ ప్రైవేట్ సంస్థకి ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ఆ ప్రైవేట్ సంస్థ అక్కడ సోలార్ ప్లాంట్ ఏదో పెట్టబోతుందట.. సోలార్ ప్లాంట్ పెట్టడం కోసం ప్రైవేట్ సంస్థకి 8300 ఎకరాల భూమిని ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ భూమిలో ఆ గ్రామం లేకుండా పోతుంది.. గ్రామానికి సంబంధించిన ఇల్లులు, గ్రామానికి సంబంధించిన రైతుల పొలాలు అవేవి కూడా లేకుండా పోతున్నాయి.
ఆ గ్రామమే మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చిత్రపటంలో లేకుండా పోతోంది. పరిశ్రమలకు భూములు ఇవ్వడం.. పరిశ్రమలు తీసుకురావడం తప్పేం కాదు.. పరిశ్రమలకు భూములు ఇచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి.. పరిశ్రమలు తీసుకురావడానికి సంబంధించి ప్రభుత్వాలు ప్రయత్నాలు చేయడాన్ని తప్పు పట్టలేము. కానీ ఊర్లను చంపా మనుషులకు ఉపాధిని దూరం చేసి.. మనుషులకు శాశ్వతంగా తమ ఊరి జాడ లేకుండా చేసి మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇండోసోల్(Indosol) అనే ఒక కంపెనీ ఇటువంటి సోలార్ ప్లాంట్ ఒకటి పెట్టడానికి ఆ ఊరు తప్ప మీకు ఇంకెక్కడ ప్లేస్ దొరకలేదా. నిరర్థకంగా పడి ఉన్న భూములు ఎన్ని ఉన్నాయి.. ఎన్ని భూములు లేవు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఎందుకు ఆ భూముల వైపు ఆలోచన చేయట్లేదు.. గ్రామాల్ని ఖాళీ చేయించేసి గ్రామాల్ని చంపేసి పరిశ్రమలు పెడతాం అనే ఆలోచన ఈ తరుణంలో.. 2025లో అటువంటి ఆలోచన చేయడం అంటే మీరు తిరోగమనంలో ఉన్నారా పురోగమనంలో ఉన్నారా. ఒకసారి ఆలోచన చేసుకోవాలి గ్రామానికి సంబంధించిన మొత్తం రైతుల ఉపాధి ఏమైపోతుంది... ప్రజలంతా తమ ఉనికి కోసం ఎక్కడికో వలసలు వెళ్ళడం తప్ప వేరే అవకాశమే లేకుండా పోతుంది కదా. పైగా ఒక ప్రొసీజర్ ఉంటుంది.. ఈ అంశంపై సీనియర్ జర్నలిస్ట్ 'YNR' విశ్లేషణ..
