Karimnagar Corporation: కరీంనగర్ కార్పొరేషన్.. కాంగ్రెస్-ఎంఐఎం.. వంద కోట్ల డీల్..!
Karimnagar Corporation: కరీంనగర్ కార్పొరేషన్.. కాంగ్రెస్-ఎంఐఎం.. వంద కోట్ల డీల్..!

కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు తెలంగాణలో హీట్ని పెంచుతున్నాయి. కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడిగా, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఉన్నారు. కరీంనగర్లో భారతీయ జనతా పార్టీకి ప్రాబల్యం ఉంది. కరీంనగర్లో ఎంఐఎం పార్టీకి కూడా ప్రాబల్యం ఉంది. కరీంనగర్లో కాంగ్రెస్ పార్టీ కూడా ఈసారి కార్పొరేషన్ ని కైవసం చేసుకోవాలి అని అనుకుంటుంది. ఎంఐఎం విడిగా పోటీ చేస్తుంది, బిఆర్ఎస్ పోటీ చేస్తుంది, బిజెపీ పోటీ చేస్తుంది, కాంగ్రెస్ పార్టీ అక్కడ పోటీ చేస్తుంది. కేంద్ర మంత్రి బండి సంజయ్ కరీంనగర్ ఎన్నికల ప్రచారం సందర్భంగా, ఇక్కడ ఎంఐఎం అండ్ కాంగ్రెస్ పార్టీలు ఒక డీల్ చేసుకున్నాయి. 100 కోట్ల రూపాయల్ని ఇక్కడ వెచ్చించబోతున్నాయి. ఈ 100 కోట్ల రూపాయల డీల్ కుదిరింది, ఈ డీల్ ఏంటంటే, భారతీయ జనతా పార్టీని కరీంనగర్ లో ఓడించడం, కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో భారతీయ జనతా పార్టీని ఓడించడం కోసం, కాంగ్రెస్ పార్టీ, ఎంఐఎం పార్టీల మధ్య 100 కోట్ల డీల్ జరిగింది అనేది, బండి సంజయ్ చేస్తున్న ఆరోపణ. బండి సంజయ చేస్తున్న ఈ ఆరోపణ పైన అటు, కాంగ్రెస్ పార్టీ, ఇటు ఎంఐఎం పార్టీ కూడా స్పందించాయి. ఎంఐఎం పార్టీ, బండి సంజ సంజయ్ ఆధారాలు లేని ఆరోపణలు అంటుంటే, కాంగ్రెస్ పార్టీ మాత్రం కేంద్ర మంత్రిగా ఉన్న బండి సంజయ్, 100 కోట్లు రెండు పార్టీల మధ్య డీల్ జరిగితే, దానికి సంబంధించిన సమాచారం ఉంటే, దానికి సంబంధించిన వివరాలన్నీ ఆయన దగ్గర ఉంటే, ఇమ్మీడియట్ గా ఆ డీల్ ఏంటో బయట పెట్టి, అందరినీ అరెస్ట్ చేసి లోపల వేయొచ్చు కదా. 100 కోట్ల రూపాయల డీల్ జరిగితే, ఆ డీల్ కి సంబంధించిన సమాచారం ఉంటే, ఎందుకు బహిరంగ సభలో దాన్ని మాట్లాడుతున్నారు. ఆయన కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా ఉన్నారు. ఆయన ఆ డీల్ చేసిన వాళ్ళని, ఆ 100 కోట్ల రూపాయలు ఎక్కడ ఉన్నాయో, ట్రేస్ చేసి, అరెస్ట్ చేసి జైలుకి పంపించవచ్చు కదా అంటూ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తోంది. అంతే కాదు, బండి సంజయ్ చేసిన ఈ ఆరోపణల పైన, బండి సంజయ ఆధారాలు లేకుండా ఇటువంటి ఆరోపణలు చేశారు కాబట్టి, ఆయన పైన కేసు నమోదు కూడా చేస్తా, ఆయన పైన కంప్లైంట్ కూడా చేస్తాం, ఆయన పైన కేసు నమోదు చేయాలని కూడా పోలీస్ అధికారులను కోరుతామంటున్నారు. ఒక నిరాధార ఆరోపణ ఎన్నికల ముందు మాపై చేస్తున్నారు కాబట్టి, ఆయన దగ్గర, ఆయన చేసిన ఆరోపణ నిరాధారమైనది మేము భావిస్తున్నాం కాబట్టి, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వబోతున్నాం. బండి సంజయ్పైన కంప్లైంట్ చేసి, ఆయన పైన కేసు నమోదు చేసి ఆయన వ్యాఖ్యలకు సమాధానం తెలుసుకుంటామంటూ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు చెప్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కరీంనగర్లో గెలవడానికి సంబంధించి భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీలు హోరాహోరి పోరాడుతున్నాయి. గతంలో కూడా కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా, కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ రాని సందర్భంలో, ఎంఐఎం మద్దతుతో అక్కడ కార్పొరేషన్లో, కాంగ్రెస్ పార్టీ పాగా వేసిన పరిస్థితి ఉంది. ఇప్పుడు డైరెక్ట్ గా ఎంఐఎం అండ్ కాంగ్రెస్ పార్టీ కలిసి పోటీ చేయకపోయినప్పటికీ, ఎంఐఎం పోటీ చేయని స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఎంఐఎం మద్దతు ఇచ్చేలా లోపాయికారి ఒప్పందం జరిగింది లాంటి చర్చ ఇప్పటికే అక్కడ ఉంది. ఆ చర్చ కేవలం లోపాయకారి ఒప్పందం మాత్రమే కాదు, ఆ ఒప్పందం విలువ 100 కోట్లు అంటూ బండి సంజయ్ చెప్పడంతో ఇది పొలిటికల్ హీట్ జనరేట్ చేస్తుంది. కరీంనగర్లో గెలిచి నరేంద్ర మోదీకి నేను ఒక కానుక ఇస్తాను. నరేంద్ర మోడీ దగ్గరికి వెళ్లి కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికను గెలుచుకొని వచ్చాను అని చెప్తే నా గౌరవం ఉంటుంది. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మీరు ఎంఐఎం కో, కాంగ్రెస్ కో ఓటు వేస్తే నరేంద్ర మోదీ దగ్గర నేను మొహం చూపించుకోలేను కాబట్టి, కరీంనగర్ ప్రజలంతా ఎంఐఎం- కాంగ్రెస్ పార్టీల రహస్య ఒప్పందాన్ని గమనించి, 100 కోట్ల రూపాయలతో కరీంనగర్ ప్రజల అభిప్రాయాన్ని మార్చాలనే వాళ్ళ ప్రయత్నాన్ని గమనించి భారతీయ జనతా పార్టీకి ఓటు వేయండి అంటూ, బండి సంజయ క్యాంపెయిన్ చేస్తున్నారు.


