2016 ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్(AP)లో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉంది. అప్పుడు కాపులు తమను బీసీల్లో చేర్చాలని ఆందోళన చేపట్టారు.

2016 ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్(AP)లో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉంది. అప్పుడు కాపులు తమను బీసీల్లో చేర్చాలని ఆందోళన చేపట్టారు. కాపులను బీసీల్లో చేర్చాలని ముద్రగడ నేతృత్వంలో పెద్ద ఎత్తున ఉద్యమం జరిగింది. ఆ సయమంలో కాపులంతా రోడ్డెక్కి ఆందోళన చేశారు. ఈ క్రమంలోనే ఓ సభ పెట్టుకున్నారు. ఆ సభ ఉద్రిక్తతలకు దారి తీసింది. అప్పుడు ఓ రైలును దగ్ధం చేశారు. అయితే ఈ రైలు దగ్ధం వెనుక రాజకీయ కుట్ర దాగుందని అప్పటి ప్రభుత్వం వాదించింది. ఆ సందర్భంగా అనేక మంది కాపు నాయకులను, యువకులను అరెస్ట్ చేసింది. వారిపై కేసులు కూడా పెట్టింది. తమపై కేసులు ఎత్తివేయాలంటూ కేసులు నమోదైన యువకులు డిమాండ్ చేశారు. కేసు కోర్టులో నడిచింది. 2019 వరకు ఉన్న టీడీపీ ప్రభుత్వం రైలు దగ్ధం వెనుక ఎవరున్నారో తేల్చలేకపోయింది. 2019లో తెలుగుదేశం పార్టీ (TDP)ప్రభుత్వం కూలిపోయింది. వైసీపీ (YCP)ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేరకు కాపు యువకులు, నేతలపై కేసులను ఉపసంహరించుకుంది. దీంతో న్యాయస్థానాలు కూడా ఈకేసులను కొట్టివేసింది. అయితే మళ్లీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కేసులను పునర్విచారణ చేయాలని కోరుతోంది. అప్పటి కేసులను తిరగదోడాలని చూస్తోంది. ఈ ఆలోచన, ఈ నిర్ణయం కూటమి సర్కార్ ఎందుకు తీసుకుందో అర్థం కావడం. ఈ అంశంపై సీనియర్ జర్నలిస్ట్ 'YNR' విశ్లేషణ..
