తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కుమరం భీం జిల్లాలోని 300కు పైగా ఆదివాసి గ్రామాలను ఖాళీ చేయించడం కోసం 49 జీవోను తీసుకొచ్చింది.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కుమరం భీం జిల్లాలోని 300కు పైగా ఆదివాసి గ్రామాలను ఖాళీ చేయించడం కోసం 49 జీవోను తీసుకొచ్చింది. దీనికి కారణం ఆ ప్రాంతంలో పులుల సంరక్షణ అని ప్రభుత్వం చెప్తోంది. పులుల సంరక్షణ పేరుతో 300కు పైగా ఆదివాసి గ్రామాలను ఆ ప్రాంతం నుంచి ఖాళీ చేయించడం అంటే వారిని ప్రపంచానికి దూరం చేయడం.. వారిని ఉపాధికి దూరం చేయడం.. వారి జీవితాలని చిన్నాభిన్నం చేయడం. ఇది మావోయిస్టులకు సంబంధించిన వర్షన్‌గా ఉంది. కొమరం భీం జిల్లాకు సంబంధించి ఈ గ్రామాలను ఖాళీ చేయడం అనే అంశం ఆ ప్రాంతంలో ఆదివాసి గిరిజనల్లో తీవ్రమైన ఆందోళనకు కారణం అవుతోంది. సో కాంగ్రెస్ సర్కార్ పదే పదే దేశంలో కాంగ్రెస్ పార్టీ నేతగా ఉన్న రాహుల్ గాంధీ ఆదివాసీలు హక్కులు అంటూ మాట్లాడుతూ ఉంటారు. తెలంగాణ(Telangana) రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రంలో ఆదివాసీలను అడవుల నుంచి తరిమేస్తుంటే, ఆదివాసీల హక్కులను కాలరాస్తుంటే, ఆదివాసీలకు జీవితాల్ని లేకుండా చేస్తుంటే ఏం చేస్తున్నారు రాహుల్ గాంధీ. ఎందుకు ఈ ప్రభుత్వాన్ని కంట్రోల్ చేయట్లేదు.. అంటూ మావోయిస్టులు ఒక సుదీర్ఘ లేఖని రిలీజ్ చేశారు. సో ఈ లేఖలో ఆదివాసీలకు సంబంధించి కాంగ్రెస్ సర్కార్ చేస్తున్న అన్యాయం ఏంటో కూడా మావోయిస్టులు ప్రస్తావిస్తూ వచ్చారు. ఆదివాసీలు సాగు చేసుకుంటున్న భూములకు కూడా పెట్టుబడి సాయం గతంలో రైతు బంధుగా (Rythu bandhu)ఇప్పుడు రైతు భరోసాగా ఉన్న పెట్టుబడి సాయాన్ని అందించాల్సిన అవసరం ఉంది అని చెప్తున్నారు. సో ఆదివాసీలకు సంబంధించి గత ఎన్నికలకు ముందు మీరు ఇచ్చిన హామీలను అమలు చేయడానికి సంబంధించి ముందుకు రావాల్సిన అవసరం ఉంది అని చెప్తున్నారు. ఆదివాసీలను ఆ ప్రాంతం నుంచి ఖాళీ చేయించడం ద్వారా ఆ భూములను కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టే కుట్ర జరుగుతోంది అనేది మావోయిష్టులకు సంబంధించిన అనుమానంగా కనబడుతోంద.అటువంటి అనుమానాన్ని వాళ్లు వ్యక్తం చేస్తున్నారు.. ఇప్పటికే ఆపరేషన్ ఖగారు పేరుతో ఛత్తీస్‌గఢ్‌..ప్రాంతంలో మావోయిస్టుల ఏరివేత పేరుతో ఆ అడవులన్నింటిని కార్పొరేట్ కంపెనీలకు అప్పచెప్పే కుట్ర జరుగుతోంది. దానిలో భాగంగా రక్తపాతం సృష్టిస్తున్నారు.. సో అడవులను కార్పొరేట్ కంపెనీలకు ఆ ప్రాంతంలో ఉన్న మైనింగ్ సంపదను వాళ్లకు దోచిపెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా కొమరం భీం జిల్లాలోని ఆదివాసీలను కూడా అక్కడి నుంచి తరలించే తరిమేసే కుట్ర చేస్తున్నారు అనే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశంపై సీనియర్‌ జర్నలిస్ట్ 'YNR'విశ్లేషణ..!


ehatv

ehatv

Next Story