ఈవీఎంల అంశానికి గడిచిన ఏడాది కాలంగా దేశవ్యాప్తంగా విస్తృతంగా చర్చ జరుగుతోంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈవీఎంల పనితీరుపై చాలా చర్చలు జరిగాయి.

ఈవీఎంల అంశానికి గడిచిన ఏడాది కాలంగా దేశవ్యాప్తంగా విస్తృతంగా చర్చ జరుగుతోంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈవీఎంల పనితీరుపై చాలా చర్చలు జరిగాయి. ఈవీఎంల పనితీరుపై జర్నలిస్ట్ వైఎన్‌ఆర్‌గా నా చానెల్‌లో ఎన్నో వీడియోలు చేశా. బ్యాలెట్ ద్వారానే ఎన్నికలు జరగాలని కోరుకునేవాళ్లలో నేను కూడా ఒకరిని. బ్యాలెట్‌ ద్వారా ఎన్నికలు జరిగితేనే తాము ఓటు వేసిన నాయకుడికే ఓటు పడిందని ప్రజలు కూడా నమ్మే అవకాశం ఉంటుంది. ప్రపంచంలో చాలా దేశాల్లో ఈవీఎంలు వాడి వదిలేశారు, ఇప్పుడు బ్యాలెట్‌ ద్వారానే ఓటింగ్‌ ప్రక్రియ జరుగుతోంది. భారత దేశంలో కూడా బ్యాలెట్‌ ద్వారానే ఓటింగ్‌ జరగాలన్న డిమాండ్‌ గడిచిన కొంత కాలంగా ఉంది. ఈవీఎంల పనితీరుపై, లోపాలపై గతంలో కూడా అనేక అంశాలను మీ దృష్టికి తీసుకొచ్చా. సుప్రీంకోర్టు చెప్పేదానికి, ఈసీ చేసిన దానికి పొంతన లేకుండా పోతుంది. గడిచిన ఏడాది ఎన్నికల ఫలితాల తర్వాత కూడా అనేక అంశాలు వైసీపీ(YCP) లేవనెత్తింది. రీకౌంటింగ్‌ చేయాలంటే కాదు కాదు రీవెరిఫికేషన్‌ చేస్తామన్నారు. పోలైన ఓట్లు, ఫలితాల తర్వాత వచ్చిన ఓటింగ్‌లో తేడాలు ఉండడం గమనించాం. అయితే ఈ అంశంపై కూటమి ప్రభుత్వం గత ఏడాదిగా ఒక్కసారి కూడా స్పందించలేదు. ఈ అంశాలపై కూటమి నుంచి ఎలాంటి ప్రకటన లేదు, స్పందన లేదు. ఈ నేపథ్యంలో తమిళనాడుకు డిప్యూటీ సీఎం పవన్‌ వెళ్లారు. అక్కడ వన్‌ నేషన్-వన్‌ ఎలక్షన్‌ సమావేశంలో పాల్గొన్నారు. అక్కడ పవన్‌ కల్యాణ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ అంశంపై సీనియర్‌ జర్నలిస్ట్ 'YNR' విశ్లేషణ..



ehatv

ehatv

Next Story