R Narayanamurthy : పవన్ కల్యాణ్పై ఆర్.నారాయణమూర్తి ఆగ్రహం..!
పవన్ కల్యాణ్ కార్యాలయం నుంచి కొన్ని రోజుల క్రితం ఓ ప్రకటన వచ్చింది.

పవన్ కల్యాణ్ కార్యాలయం నుంచి కొన్ని రోజుల క్రితం ఓ ప్రకటన వచ్చింది. ఆ ప్రకటనలో 'హరిహరవీరమల్లు' (HariHara Veeramallu)సినిమాపై కుట్రలు జరుగుతున్నాయని ఉంది. ఆ కుట్రలో భాగంగానే థియేటర్ల మూసివేసేందుకు ప్లాన్ వేశారన్నారు. కొంత మంది కలిసి మంచి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు.. గత ప్రభుత్వం నుంచి ఇండస్ట్రీని కాపాడుతే మంచి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారన్నారు. ఈ నేపథ్యంలోనే సినిమాటోగ్రఫీ మంత్రి దుర్గేష్ (Minister Durgesh)కూడా తీవ్ర ఆరోపణలు చేశారు.
హరిహరవీరమల్లుపై ఆ నలుగురు కుట్ర చేశారన్నారు. ఈ నేపథ్యంలో ఈ కుట్రపై విచారించాల్సిందిగా హోంశాఖకు ఆదేశాలు కూడా ఇచ్చారు. అయితే ఆ నలుగురుగా చెప్పుకునే అల్లు అరవింద్(Allu Aravind), దిల్రాజ్ (Dil Raju)ప్రెస్మీట్ పెట్టారు. ఆ నలుగురిలో మేం లేమన్నారు. థియేటర్లకు సంబంధించిన ఆలోచన మాత్రమే ఉంది. థియేటర్లు మూసివేయాలన్న నిర్ణయం తీసుకోలేదన్నారు. ఒకరిద్దరు థియేటర్లు మూసివేయాలని కోరారని.. అందులో జనసేన వారు కూడా ఉన్నారని దిల్ రాజ్ అన్నారు. ఆ తర్వాత ఆ జనసేన నేత(Janasena)ను పార్టీకి దూరంగా ఉండాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఆర్.నారాయణమూర్తి(R Narayanamurthy) ప్రెస్ మీట్ పెట్టారు. ఆ ప్రెస్ కాన్ఫరెన్స్లో పవన్ వ్యాఖ్యలను తప్పుబట్టారు. ఆర్.నారాయణమూర్తి వ్యాఖ్యలపై సీనియర్ జర్నలిస్ట్ 'YNR' విశ్లేషణ..
