Rbi Data Exposes : అడ్డంగా బుక్కయిన కూటమి..!
ఆంధ్రప్రదేష్లో జగన్మోహన్ రెడ్డి సర్కారు హాయంలో రాష్ట్రంలో విధ్వంసం జరిగింది.

ఆంధ్రప్రదేష్లో జగన్మోహన్ రెడ్డి సర్కారు హాయంలో రాష్ట్రంలో విధ్వంసం జరిగింది. రాష్ట్రంలో విద్వంస పాలన నడిచింది. ఆంధ్రప్రదేష్ రాష్ట్రం వైపు చూడాలంటే పారిశ్రామిక వేత్తలు భయపడి పారిపోతున్నారు, ఆంధ్రప్రదేష్ రాష్ట్రంలో జరుగుతున్న విధ్వంసాన్ని చూసిన తరువాత ఆంధ్రప్రదేష్లో పెట్టుబడులు పెట్టాలనే ఆలోచన కూడా ఎవరికీ రావట్లేదు. అంతేకాదు జగన్మోహన్ రెడ్డి సర్కార్ పోయిన తర్వాత కూడా మళ్ళీ పెట్టుబడులు పెట్టాలంటే, ఇప్పటికీ పారిశ్రామిక వేత్తల్లో ఆందోళన భయం పోవట్లేదు, గడిచిన ఐదేళ్ళు తెలుగుదేశం -జనసేన పార్టీలు మాట్లాడుతూ వచ్చిన మాటలు ఇవి. ఆ రెండు పార్టీలు ప్రధానంగా రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి నాశనం చేశారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తే రాష్ట్రం పరిస్థితి దారుణంగా ఉంటుంది. ఐదేళ్ళు ఆయన పరిపాలించి 30-40 ఏళ్ళు రాష్ట్రాన్ని వెనక్కి నెట్టేశారు. ఈ తరహా రాతలు, ఈ తరహా మాటలు ఐదేళ్ల కాలంలో చూశాం. అంతేకాదు ఆంధ్రప్రదేష్ శ్రీలంకలా మారిపోయింది, ఆంధ్రప్రదేష్ దారుణమైన అప్పుల్లో కూరికుపోతుంది. ఆంధ్రప్రదేష్ అప్పులు చూస్తే ప్రపంచంఅంతా నివ్వెరపోతోంది. ఇటువంటి మాటలు కూడా చూశాం. పార్టీలు మాత్రమే కాదు, కొంతమంది మేధావులుగా చెప్పబడుతున్న వాళ్ళు కూడా ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి మరీ ఆంధ్రప్రదేష్ అప్పుల పరిస్థితి ఏంటో అర్థం కావట్లేదు, ఆంధ్రప్రదేష్ లో ఎన్ని అప్పులు ఉన్నాయో కూడా తెలియట్లేదు అది 14 లక్షల కోట్లు 15 లక్షల కోట్లు అనుకుంటున్నాం అది అక్కడ ఆగిపోయిందో లేకపోతే ఇంకా పెరిగిపోయిందో తెలియట్లేదు అంటూ తప్పుడు ప్రచారాన్ని చేశారు. తప్పుడు ప్రచారాలు ఎప్పటికీ నిలబడవు, వాస్తవాలు ఏంటో తెలుస్తాయి. ఆ పార్టీలకు సంబంధించిన నాయకులు, ఆ మేధావులు వీళ్ళంతా మేధావులుగా చెప్పబడుతున్న వాళ్ళు, వీళ్ళంతా మాట్లాడిన మాటలు, జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఉంటే, నాకు ఇంకెవరికో అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదు, బహుశా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అభ్యంతరం ఉంటే, ఉంటుంది, వీరో రాజకీయ పార్టీ, వాళ్ళ రాజకీయ పార్టీలు కాబట్టి విమర్శలు చేసుకోవచ్చు కానీ, మాట్లాడిన మాటలు ఆంధ్రప్రదేష్ రాష్ట్రానికి వ్యతిరేకంగా మాట్లాడిన మాటలు, ఆంధ్రప్రదేష్ అభివృద్ధికి వ్యతిరేకంగా మాట్లాడిన మాటలు, ఆంధ్రప్రదేష్ ప్రజలకు వ్యతిరేకంగా మాట్లాడిన మాటలు ఆంధ్రప్రదేష్ బ్రాండ్ ఇమేజ్ ని దెబ్బ తీయడం కోసం మాట్లాడిన మాటలు, జగన్మోహన్ రెడ్డితో రాజకీయంగా ఫైట్ చేయండి, జగన్మోహన్ రెడ్డి పైన రాజకీయంగా విమర్శలు చేయండి, ఓకే బట్ ఆంధ్రప్రదేష్ రాష్ట్ర బ్రాండ్ ని దెబ్బతీసే ప్రయత్నం ప్రతిపక్ష పార్టీగా ఉండి చేశారు. ఐదేళ్ల కాలంలో, ఐదేళ్ల కాలంలో ఆ పరిస్థితి వాస్తవమా లేదా తెలుసుకునే ప్రయత్నం కూడా ప్రజలకు లేకుండా చేశారు. అటువంటి అవకాశం కూడా లేకుండా చేశారు. నాన్ స్టాప్ గా ఒక తరహా నెగిటివ్ క్యాంపెయిన్ చేస్తూ చేస్తూ చేస్తూ చేస్తూ వచ్చారు. అప్పులు తెస్తున్నారు, పేదోలకు పని చేస్తున్నారు, అకౌంట్లో వేస్తున్నారు ఇట్లా అయితే, రాష్ట్రం ఎట్లా అభివృద్ధి చెందుతుంది, అప్పులు తీసుకొచ్చి అకౌంట్ లో డబ్బులు వేయడం అభివృద్ధి, ఇది పరిపాలన ఒక అటెండర్ చేస్తాడు, లేవలేని ముసలమ్మ కూడా చేస్తది అని చెప్పారు. ఇంక ఈ తరహా ఎన్ని చెప్పాలో అన్నీ చెప్పారు అవన్నీ అబద్ధాలని ఈరోజు తేలిపోయింది. ఇదే అంశంపై సీనియర్ జర్నలిస్ట్ 'YNR' విశ్లేషణ..!


