MLC Kavitha: నిప్పూ నిజమే--పొగా నిజమే..!

తెలంగాణలో గత రెండు రోజులుగా ఎమ్మెల్సీ కవిత లేఖ వ్యవహారంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఎమ్మెల్సీ కవిత తన తండ్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు రాసిన లేఖపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. బీఆర్ఎస్ పార్టీ వజ్రోత్సవ సభ తర్వాత ఆ సభ గురించి పాజిటివ్ ఫీడ్ బ్యాక్, నెగెటివ్ ఫీడ్ బ్యాక్పై ఎమ్మెల్సీ కవిత లేఖ రాశారు.. ఆ లేఖలో పెద్ద నెగెటివ్ అంశాలు లేవు కానీ లేఖ బయటకు రావడంపై చర్చ జరుగుతుంది. ఆమె అమెరికా పర్యటన తర్వాత, ఎయిర్పోర్టులో దిగిన తర్వాత నేరుగా మీడియాతో మాట్లాడారు. గతంలో కూడా కేసీఆర్కు చాలా సార్లు లేఖలు రాశానని, అందులో పార్టీకి వ్యతిరేకంగా ఏమీ లేదని ఆమె వివరించే ప్రయత్నం చేశారు. కానీ ఈ లేఖ ఎలా బయటకు వచ్చిందో తేలాలన్నారు. దీంతో పార్టీలో ఏదో జరుగుతుతోంది అనే చర్చ మొదలైంది. లేఖ ఎలా బయటకు వచ్చిందనేది ఇప్పుడు తేలాల్సి ఉంది. కేసీఆర్ దేవుడే కానీ కేసీఆర్ చుట్టూ దయ్యాలు చేరాయన్నారు. తాను రాసిన లేఖపై ఆమె మాట్లాడిన మాటలు కాస్త పార్టీ లైన్కు కొంత విరుద్ధంగా మాట్లాడినట్లు అనిపించింది. పార్టీలో నాయకుడు చుట్టూ దయ్యాలు ఉన్నాయనే మాట మీడియాతో మాట్లాడడం పార్టీ లైన్కు విరుద్ధంగా మాట్లాడినట్లే. ఒక రాజకీయపార్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీడియాతో మాట్లాడాల్సిన అవసరం లేదు. తన తండ్రికి నేరుగా వెళ్లి చెప్పడం.. లేదా అంతర్గత సమావేశంలో చెప్పొచ్చు కానీ ఆమె రాసిన లేఖతో పార్టీలో ఏదో జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ అంశంపై సీనియర్ జర్నలిస్ట్ 'YNR' విశ్లేషణ..!
