Special Status-Special Package: అనాథలుగా మిగిలిన ప్రత్యేక హోదా-ప్రత్యేక ప్యాకేజీ..!
Special Status-Special Package: అనాథలుగా మిగిలిన ప్రత్యేక హోదా-ప్రత్యేక ప్యాకేజీ..!

ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన రెండు కీలకమైన అంశాలు అనాధలుగా మిగిలిపోయాయి. అనాధలుగా మిగిలేలా చేశారు. ఎవరు ఆంధ్రప్రదేశ్ని పాలించిన పాలకులు, పాలిస్తున్న పాలకులు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత 2014 సమయంలో, ఆంధ్రప్రదేశ్ కి ఐదేళ్ల పాటు ప్రత్యేక హోదా అంశానికి సంబంధించి, అప్పటి యూపిఏ సర్కార్ ప్రామిస్ చేసింది. అప్పుడు ఎన్నికల్లో పోటీ చేస్తున్న మోదీ నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ, ఎన్డీఏ కూటమి, ఆంధ్రప్రదేశ్ కు ఐదేళ్ళు కాదు, 10ఏళ్ళు ప్రత్యేక హోదా ఉండాల్సిన అవసరం ఉంది అంటూ ఎన్నికల సభల్లో మాట్లాడడం చూసాం. ప్రత్యేక హోదా సాధించే వరకు నిద్రపోమంటూ ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పార్టీలు ప్రతినబూనడం కూడా చూసాం. 2014లో ఆంధ్రప్రదేశ్ లోనూ, కేంద్రంలోనూ, ఎన్డీఏ సర్కార్ వచ్చింది. ఎన్డిఏ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత, 14వ ఆర్థిక సంఘం సిఫారసు చేసింది అంటూ కొత్తగా దేశంలో ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే ఆలోచన కేంద్ర ప్రభుత్వానికి లేదు, అలా ఇవ్వకూడదు అంటూ 14వ ఆర్థిక సంఘం చెప్పింది అంటూ, కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా అనేది ఒక ముగిసిపోయిన అధ్యాయం, సాధ్యం కాదు అని చెప్పింది. కానీ ఆంధ్రప్రదేశ్ లోనూ, కేంద్రంలోనూ, ఎన్డీఏ సర్కార్ ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మోదీ హామీ ఇచ్చారు, ప్రత్యేక హోదా అంశానికి సంబంధించి కాబట్టి, ఏం చేయాలనే దానిపైన, తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీలో తర్జన బర్జన పడి, ప్రత్యేక హోదాతో సమానమైన ప్రత్యేక ప్యాకేజీని ఇవ్వబోతున్నాం అంటూ ప్రకటించారు. ప్రత్యేక ప్యాకేజీని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 14 నుంచి 19 వరకు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ సమర్ధించింది. ప్రత్యేక హోదాతో, ఏం వస్తుంది దానికి, ఈక్వల్ గా ఉండే ప్రత్యేక హోదాని మేము సాధిస్తున్నాం, ప్రత్యేక హోదా ఇప్పుడు సాధ్యం కాదు కాబట్టి, ప్రత్యేక ప్యాకేజీతో మనం సర్దుకోవాల్సిందే. ప్రత్యేక ప్యాకేజీ వల్ల హోదా కంటే ఇంకా అద్భుతంగా ఎక్కువగా ప్రయోజనాలు ఉంటాయంటూ, అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడడం చూసాం, అప్పుడు కేంద్రంలో మంత్రులుగా ఉన్న తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు కూడా, ప్రత్యేక ప్యాకేజీ అనేది ఒక అద్భుతంగా మాట్లాడడం చూసాం, సో ఆ ప్రత్యేక ప్యాకేజీ కి సంబంధించి, ఒప్పుకున్న తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు, ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష పార్టీలన్నీ ప్రత్యేక హోదాని వదిలేస్తే ఎలా, ప్యాకేజీకి ఒప్పుకుంటే ఎలా అంటూ, మాట్లాడుతున్న నేపథ్యంలో, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు సభలు పెట్టి, ప్రత్యేక ప్యాకేజ్ అనేది ఒక పాచిపోయిన లడ్డు, ప్రత్యేక హోదా కావాల్సిందే అన్నట్టు సభలు పెడుతున్న నేపథ్యంలో, ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో, ప్రత్యేక హోదా కోసం, ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంపీలు రాజీనామా ప్రకటన కూడా చేసిన నేపథ్యంలో, తెలుగుదేశం పార్టీ హోదా కావాల్సిందే అనే నినాదాన్ని మళ్ళీ ఎత్తుకుంది. హోదా ఇవ్వకపోతే భారతీయ జనతా పార్టీ నుంచి బయటికి వస్తామని చెప్పింది, ఎన్డీఏ నుంచి బయటికి వచ్చి ప్రత్యేక హోదా కోసం, అటు పవన్ కళ్యాణ్ కంటే, ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంటే, ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తున్న మిగతా ఆంధ్రప్రదేశ్ కుకి సంబంధించిన అనేక సంఘాల కంటే, మేమే ముందున్నామంటూ, ప్రత్యేక హోదా రేస్ లో అందరికంటే ముందు నిలిచే ప్రయత్నం చేసింది. 2019 ఎన్నికల కంటే ముందు, ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే అనే డిమాండ్ తో, భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతూ వచ్చింది. ప్రత్యేక హోదా ఇవ్వలేదనే కారణంతో, మేము బయటికి వస్తున్నాం అంటూ బయటికి వచ్చింది. సరే 2019 ఎన్నికల సమయంలో అప్పటి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా ప్రత్యేక హోదా తీసుకొస్తామంటూ ప్రామిస్ చేసింది. కేంద్రంలో మన మద్దతుతో ఉండే ప్రభుత్వం రావాలి, అప్పుడు కచ్చితంగా మన మద్దతు వాళ్ళకి అవసరం ఉంటుంది కాబట్టి, ప్రత్యేక హోదా సాధించగలగలం అంటూ జగన్మోహన్ రెడ్డి చెప్తూ రావడం చూసాం. ఎన్నికలు ముగిసిన తర్వాత సొంతంగానే కేంద్రంలో భారతీయ జనతా పార్టీకి మెజారిటీ వచ్చిన నేపథ్యంలో, ఇంక మేమేం చేయలేము, మేము ప్రత్యేక హోదా తేలేమంటూ జగన్మోహన్ రెడ్డి చేతులు ఎత్తేయడం చూసాం, ప్రత్యేక హోదా తేలేమని చేతులు ఎత్తేసిన జగన్మోహన్ రెడ్డి, ప్రత్యేక ప్యాకేజ్ గురించి మాట్లాడలేదు, అలాగని ఢిల్లీ కి వెళ్ళిన ప్రతిసారి ప్రత్యేక హోదా గురించి అడుగుతాను అనే మాట చెప్తూ వచ్చారు. ఐదేళ్ళు కూడా ప్రత్యేక హోదా అనాథగానే మారిపోయింది. ప్రత్యేక ప్యాకేజ్ కూడా అనాతగానే మారిపోయింది. ఇప్పుడు 2024 లో మళ్ళీ ఎన్డీఏ సర్కార్ కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ అధికారంలోకి వచ్చాయి. డబుల్ ఇంజన్ సర్కార్ ఉంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అంటూ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడం విన్నాం, భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకుల ప్రకటనలు చూసాం, డబుల్ ఇంజన్ సర్కార్ ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం అయినప్పుడు, గతంలోనే ఎన్డీఏ సర్కార్ ప్రామిస్ చేసిన, గతంలో కేంద్ర క్యాబినెట్ ఆమోదించిన ప్రత్యేక ప్యాకేజీ ఎందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇప్పుడు రావట్లేదు, ప్రత్యేక ప్యాకేజీని కూడా అక్కడ ఇక్కడ అధికారంలో ఉన్న ఎన్డీఏ నాయకులు ఎందుకు ప్రస్తావించట్లేదు. ఆంధ్రప్రదేశ్ కి అసలు ప్రత్యేక హోదా కూడా అవసరం లేదా, ప్రత్యేక ప్యాకేజ్ కూడా అవసరం లేదా, ఆ స్థాయిలో 10 ఏళ్ల కాలంలో, 12 ఏళ్ల కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అద్భుతంగా అభివృద్ధి చేశారా, ప్రత్యేక హోదా వద్దు అని 14వ ఆర్థిక సంఘం చెప్తే, ప్రత్యేక ప్యాకేజీని ఒప్పుకున్న కేంద్ర ప్రభుత్వం, ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని చెప్పిన కేంద్ర ప్రభుత్వం, అదే ప్యాకేజీ కి యాక్సెప్ట్ చేసిన తెలుగుదేశం పార్టీ, ఇప్పుడు కనీసం ప్యాకేజీ కి సంబంధించిన ప్రస్తావన కూడా ఎందుకు తీసుకురావట్లేదు. ఈ అంశంపై పూర్తి విశ్లేషణ ఈ వీడియోలో..!


