ఆంధ్రప్రదేశ్‌లో ఆడబిడ్డలకు రక్షణ ఉందా అంటే సారీ టు సే.. రక్షణ లేదు.. ఇటీవలి కాలంలో అనేక ఘటనలు వరుసగా జరుగుతున్నాయి.

ఆంధ్రప్రదేశ్‌లో ఆడబిడ్డలకు రక్షణ ఉందా అంటే సారీ టు సే.. రక్షణ లేదు.. ఇటీవలి కాలంలో అనేక ఘటనలు వరుసగా జరుగుతున్నాయి.ఇప్పటికే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 1600 మందికిపైగా మహిళలు అదృశ్యమైనట్లు వివిధ పోలీస్‌ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా మహిళలపై దాడులు జరిగాయి. ఆ సమయంలో వైసీపీ(YCP) ప్రభుత్వం దిశ యాప్(Disha App), మహిళా పోలీస్‌స్టేషన్లు ఏర్పాటు చేసి తాము మహిళల కోసం ఏదో చేస్తున్నామనే విషయాన్ని ప్రొజెక్ట్ చేసింది. అయినా కూడా అక్కడక్కడా దాడులు జరగడాన్ని చూశాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు అనేక ప్రశ్నలు లేవనెత్తారు. ఈ ప్రభుత్వంలో మహిళలకు రక్షణే లేదంటూ రకరకాలుగా వ్యాఖ్యానించారు. ప్రభుత్వ పెద్దలే ఉమెన్ ట్రాఫికింగ్‌కు పాల్పడుతున్నారని ఆరోపించారు. 30 వేల మంది మహిళలు మాయపోయారని స్వయంగా ఇప్పటి డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్ అన్నారు. ఆ తర్వాత ఆ 30 వేల మంది ఎక్కడున్నారనే విషయాన్ని చెప్పలేకపోయారు. ఇటీవల జరుగుతున్న వరుస ఘటనల గురించి అడిగితే ప్రభుత్వ పెద్దలు చెప్పలేకపోతున్నారు. పైగా ఎవరైనా ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారు. తాజాగా కడపలో కూడా మహిళల రక్షణ డొల్లతనం బయటపడింది. ఈ అంశంపై సీనియర్ జర్నలిస్ట్ 'YNR' విశ్లేషణ..!



Updated On 9 Jun 2025 1:30 PM GMT
ehatv

ehatv

Next Story