వైఎస్‌ఆర్సీపీకి ఎజెండా లేకుండా చేసేద్దాం.. వైఎస్‌ఆర్సీపి విమర్శించడానికి లేకుండా చేద్దాం.. తమ ప్రభుత్వంపై నోరెత్తే చాన్స్‌ లేకుండా ప్లాన్ చేద్దాం.. దాని కోసం ఎలా ముందుకు వెళ్దాం.

వైఎస్‌ఆర్సీపీకి ఎజెండా లేకుండా చేసేద్దాం.. వైఎస్‌ఆర్సీపి విమర్శించడానికి లేకుండా చేద్దాం.. తమ ప్రభుత్వంపై నోరెత్తే చాన్స్‌ లేకుండా ప్లాన్ చేద్దాం.. దాని కోసం ఎలా ముందుకు వెళ్దాం.. గడిచిన కొద్దిరోజులుగా చేస్తున్న టీడీపీ(TDP) చేస్తున్న మేథో మథనం ఇది. ఇన్ని రోజులు సంక్షేమ కార్యక్రమాల అమలులో వైసీపీ(YCP) ఛాంపియన్ అనే వాదన ఉంది. సంక్షేమ కార్యక్రమాల ద్వారానే గెలుస్తామని ఆ పార్టీ కూడా భావించింది. గడిచిన ఐదేళ్లు ఆ పార్టీ ఆ ఆలోచనలోనే ఉంది. అయితే అధికారం కోల్పోయిన తర్వాత కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుపై విమర్శలు చేస్తూ వచ్చింది. సూపర్‌ సిక్స్‌(Super Six) అమలు చేయడం లేదంటూ..సూపర్‌ సిక్స్‌ అంశాన్ని ఎత్తుకొని ప్రజల్లోకి వెళ్లడం ప్రారంభించింది. జగనన్న ఉండి ఉంటే ఇప్పటికే అమ్మ ఒడి, రైతు భరోసా పడి ఉండేది కదా.. జగనన్న ఉండి ఉంటే ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు జరిగేవి అన్న ఆలోచనను ప్రజల్లో కలిగించారు. ఏడాది కాలంలో ప్రజలు ఎంత నష్టపోయారో అనేది వివరించడానికి ప్రయత్నించింది. ఏడాది కాలంగా మాజీ సీఎం జగన్‌ కూడా సెటైరికల్‌గా నీకు 15 వేలు.. నీకు 15 వేలు అన్నారు కదా.. ఇప్పుడు ఎక్కడా అంటూ విమర్శిస్తూ వచ్చారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన రకరకాల హామీలపై విమర్శలు ఎక్కుపెట్టారు. అయితే పెన్షన్ల అంశాన్ని మాత్రం లేవనెత్తలేదు. అధికారంలోకి వచ్చిన వెంటనే కూటమి ప్రభుత్వం పెన్షన్లను పెంచింది. ఎన్నికలకు ముందు ఈ హామీలు అమలు చేయలేరన్న జగన్‌.. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే పెన్షన్లను పెంచింది.. అమ్మకు వందనం ప్రారంభించింది. అంతే కాదు రైతు భరోసాకు కూడా రెడీ అయింది. ఎటు తిరిగి వైసీపీకి ఎజెండా లేకుండా చేయాలనేది కూటమి ప్రభుత్వ నిర్ణయం.. ఈ అంశంపై సీనియర్ జర్నలిస్ట్ 'YNR' విశ్లేషణ..!

ehatv

ehatv

Next Story