ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తల్లికి వందనం పేరుతో విద్యార్థుల తల్లుల ఖాతాల్లో అమౌంట్‌ జమ చేశారు.

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తల్లికి వందనం పేరుతో విద్యార్థుల తల్లుల ఖాతాల్లో అమౌంట్‌ జమ చేశారు. 15 వేలు వేస్తామని 13 వేలు మాత్రమే వేశారు. ఆంధ్రప్రదేశ్‌లో 1 నుంచి 11వ తరగతి వరకు చదివే విద్యార్థులు 87 లక్షల మంది ఉన్నారు. ఇంకా అంత కంటే 5-6 లక్షల మంది విద్యార్థులు అధికంగానే ఉన్నారు. అయితే 67 లక్షల మంది విద్యార్థులకే ఇప్పుడు నిధులు జమ చేశారు. ప్రతిపక్షమో, కూటమి ప్రభుత్వం దీనిని వ్యతిరేకిస్తున్నారు. 87 లక్షల విద్యార్థులు ఉంటే. 67 లక్షలే ఎలా వేస్తారంటున్నారు. 15 వేలు వేస్తామని 13 వేలు ఎలా వేస్తరాని ప్రశ్నిస్తున్నారు. అందులో రెండు వేలు స్కూళ్ల మెయింటెనెన్స్‌కు పోతాయంటున్నారు. గతంలో వైసీపీ ఇదే చెప్తే విమర్శించారు. ఓ రకంగా ఇది ఒక తరహా మోసమే. 87 లక్షల నునంచి విద్యార్థుల సంఖ్య తగ్గింది, ఇంకా తగ్గే అవకాశం కూడా ఉంది. ఒక ఏడాది తల్లికి వందనం నిధులు ఎగ్గొట్టింది. తల్లికి వందనం పేరుతో విద్యార్థుల తల్లుల ఖాతాల్లో పడాల్సిన దాదాపు 10 వేల కోట్లు రూపాయలు డబ్బులు ఎగ్గొట్టింది. పెన్షన్లు పెంచి రీఎంబర్స్‌ కూడా చేసి పెన్షన్లపై ఇచ్చిన మాటను కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుంది. అదే సమయంలో తల్లికి వందనం పేరుతో ఎందుకు నిలబెట్టుకోలేకపోయింది. ఈ అంశంపై సీనియర్‌ జర్నలిస్ట్ 'YNR' విశ్లేషణ..


ehatv

ehatv

Next Story