తెలంగాణలో సుదీర్ఘకాలంగా ఎదురు చూస్తోన్న మంత్రి విస్తరణ ఎట్టకేళకు పాక్షికంగా పూర్తయింది.

తెలంగాణలో సుదీర్ఘకాలంగా ఎదురు చూస్తోన్న మంత్రి విస్తరణ ఎట్టకేళకు పాక్షికంగా పూర్తయింది. కేబినెట్‌లో ఆరు ఖాళీలుంటే ముగ్గురు కొత్తవారికి అవకాశం కల్పించారు. ముగ్గురిలో ఎస్సీ మాల, ఎస్సీ మాదిగ, ముదిరాజ్‌ సామాజిక వర్గాల నుంచి కేటాయించారు. రెడ్డి సామాజిక వర్గం నుంచి కొంత మందికి అవకాశం కల్పిస్తారని వార్తలు వచ్చినా అలా జరగలేదు. ఇంకా మూడు ఖాళీలు ఉన్నాయి కాబట్టి అసంతృప్తులను బుజ్జగించేందుకు ఈ తరహా వ్యూహం చేపట్టారు. ఆ మూడు ఖాళీలతో పాటు కొందరిని తప్పించి ఇతరులకు అవకాశం కల్పిస్తామని కూడా చెప్తున్నారు. సామాజికవర్గాల కూర్పుతో మంత్రి వర్గ విస్తరణ చేపట్టామని కాంగ్రెస్‌(Congress) గొప్పగా చెప్పుకున్నా ఆ స్థాయిలో సంతృప్తి వ్యక్తం చేయడం లేదని తేలింది. లోపోపల కాంగ్రెస్‌లో తీవ్ర చర్చ జరుగుతోంది. ముఖ్యంగా ఆ పార్టీలోని బీసీ (BC)సామాజికవర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. దేశవ్యాప్తంగా కులగణన చేయాలని కాంగ్రెస్‌ డిమాండ్‌ చేస్తూ వస్తోంది. ఈ మేరకు కేంద్రం కూడా బీసీ కులగణనను చేపట్టాలని నిర్ణయించారు. 2026-27లో కులగణన కూడా చేపట్టబోతున్నారు. అయితే ఈ కేబినెట్‌లో మైనార్టీలకు అసలు స్థానమే లేదు. తెలంగాణ(Telangana) ఏర్పడిన 10 ఏళ్లలో ఒక్క మైనార్టీ లేకుండా కేబినెట్‌ లేనే లేదు. రెండో సీఎం అయ్యాక కేసీఆర్‌(KCR), మహమూద్‌ అలీ మాత్రమే ప్రమాణస్వీకారం చేశారు. ఇప్పుడు కేబినెట్‌లో ముగ్గురు మాత్రమే బీసీలున్నారు. అయితే మరో రెండు సామాజిక వర్గాల్లో తీవ్ర అసంతృప్తి ఉంది. ఒకటి మున్నూరు కాపు, రెండు యాదవ్‌ కులం (Yadava Community )మాత్రమే. 10 ఏళ్లలో మున్నురుకాపు సామాజివర్గానికి చెందిన జోగు రామన్న, గంగుల కమలాకర్‌ ఉన్నారు. యాదవుల్లో తలసాని శ్రీనివాస్‌ యాదవ్ కూడా మంత్రిగా కొనసాగారు. కానీ కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అత్యధిక జనాభా కలిగి ఉన్న ఈ రెండు కులాలకు తీవ్ర అన్యాయం జరిగింది. ముఖ్యంగా యాదవ్‌లకు తీవ్ర అన్యాయం జరిగింది. ఈ అంశంపై సీనియర్ జర్నలిస్ట్ 'YNR' విశ్లేషణ..!



Updated On 9 Jun 2025 2:00 PM GMT
ehatv

ehatv

Next Story