Andhra Jyothi Radhakrishna : ఎవరు కూలీలు..మీ కూలి విశాఖ భూములా ? ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకు మెంటల్ బ్యాలెన్స్ తప్పిందా..!
Andhra Jyothi Radhakrishna : ఎవరు కూలీలు..మీ కూలి విశాఖ భూములా ? ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకు మెంటల్ బ్యాలెన్స్ తప్పిందా..!

ఆంధ్రజ్యోతి గ్రూప్ సంస్థల అధినేత వేమూరి రాధాకృష్ణ గారి కొత్త పలుకు పైన రెస్పాండ్ అవ్వాలనుకున్నాను. ఆయన ఇంతకంటే దిగజారరు అనుకున్న ప్రతిసారి మనల్ని డిసపాయింట్ చేస్తున్నారు, అంతకంటే దిగజారి రాస్తున్నారు, ఈరోజు రెండు కీలకమైన అంశాల పైన ఆయన విశ్లేషణ రాశారు, ఒకటి తెలంగాణలో ఫోన్ టాపింగ్ అంశానికి సంబంధించి, కేసిఆర్ ని విచారణకు పిలిచారు. కేసిఆర్ ని విచారణకు పిలవడం అంటే తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బ తీసినట్లుగా, మొత్తం గగ్గోలు పెడుతుంది టిఆర్ఎస్ పార్టీ, బిఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా, ఇంకెవ,రో ఇంకెవరో సో అది సరైంది కాదు, ఆత్మగౌరవం కేసీఆర్ కి ఒక్కడికే ఉంటుందా అంటూ రాశారు. ఆయన దానితో పాటు మరొక అంశం తిరుమల లడ్డు అంశానికి సంబంధించి రాశారు, ముందుగా కేసీఆర్ కి నోటీసులు ఇచ్చిన అంశానికి సంబంధించి చూద్దాం, ఎందుకు నేను మొదట్లోనే అంత సీరియస్ వర్డ్ వాడాను, ఆయన ఇంతకంటే దిగజారుడు అనుకున్న ప్రతి సారి దిగజారుతున్నారని ఎందుకు వాడాను అంటే, దీనికంటే ముందు వారం, ఆయన రాసిన ఆర్టికల్, ఆయన రాసిన కొత్త పలుకు ఆర్టికల్, ఒకసారి మీరు చదవండి, ఆ ఆర్టికల్ లో నేను పక్కన వీలుంటే డిస్ప్లే చేస్తున్నాను, డిస్ప్లే చేసి చూపిస్తున్నాను, ఆర్టికల్ లో ఆయన రాసిన పదాలు, అక్షరాల ఫోన్ ట్యాపింగ్ అంశానికి సంబంధించి, టెలిగ్రాఫ్ యాక్ట్ ప్రకారం, ఇమ్మీడియట్ గా కేసీఆర్ ని ,అరెస్ట్ చేసి లోపల వేయొచ్చు అని రాశారు, అంటే ప్రభుత్వానికి ఫోన్ ట్యాపింగ్ చేసింది అనే దానికి సంబంధించిన ఆధారాలు దొరికాయి. ఆధారాలు దొరికిన తర్వాత కూడా ప్రభుత్వం తాత్సారం చేస్తోంది, ఆయనను అరెస్ట్ చేయకుండా ఎందుకు ఆపుతోంది, ఫోన్ టాపింగ్ కి మాజీ ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు కూడా మేము బాధ్యతలు అని చెప్తున్నప్పటికీ, దీనికి సంబంధించిన ఆధారాలు ప్రభుత్వానికి చేరినప్పటికీ ఎందుకు ఆయన అరెస్ట్ చేయకుండా ఆపుతున్నారు అని గతవారం ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ రాసిన ఆర్టికల్ చూసాం మనం. ఈ వారం ఆయన రాసిన ఆర్టికల్లో చెప్పిన మాట, రెండు లైన్స్ చదివి వినిపిస్తా ఇప్పుడు, సీట్ విచారణలో కూడా కేసిఆర్ దోషి అని తీర్చడం సులువు కాదు, కేసిఆర్ తో పాటు ,అప్పుడు చక్రం తిప్పిన వాళ్ళు కూడా, తాము కోరుకున్న ఫోన్ ని నంబర్లను, ఊరు పేరు రాయకుండా, నక్షలైట్లతో ముడిపెట్టి, సంబంధిత కమిటీల నుంచి ఆమోదం పొందారు, ఈ కేసులో కేసిఆర్ ని ఇరికించడం దాదాపు అసాధ్యం, గతవారం మీరు రాసిన దానికి, ఈ వారం మీరు రాసిన దానికి సంబంధమే లేదు, టెలిగ్రాఫ్ చట్టం ఆధారాలన్నీ ప్రభుత్వాల దగ్గర ఉన్నాయి అయినప్పటికీ ఆయన్ని అరెస్ట్ చేయకుండా, ఆయన పైన చర్యలు తీసుకోకుండా, ఎందుకు తీసుకోకుండా, ఎందుకు ఆలస్యం చేస్తున్నారు అని రాసి వారం రోజులు తిరిగేలోపు, అసలు కేసీఆ అరెస్ట్ చేయడం అసాధ్యం అని రాశారు. ఒకసారి అసలు ఈ టెలిగ్రాఫ్ అంశానికి సంబంధించి ఫోన్ ట్యాపింగ్ అంశానికి సంబంధించి చూస్తే, తెలంగాణ రాష్ట్రంలో గత సర్కారు, టెలిఫోన్ ట్యాపింగ్ చేసింది అని ఆరోపణలు చేసిన వాళ్ళు, ఎవరు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్ ,అలాగే ఈటల్ రాజేందర్ అలాగే భారతీయ జనత పార్టీకి సంబంధించిన కొంతమంది నాయకులు, రేవంత్ రెడ్డి అప్పుడు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నారు, కొంతమంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు, వీళ్ళు మా ఫోన్లు ప్రభుత్వం వింటుంది టాప్ చేస్తుంది అంటూ మాట్లాడారు. వీళ్ళు మాత్రమే కాదు ఈ దేశంలో అనేక రాష్ట్రాల్లో, అధికార పార్టీ మా ఫోన్లను ట్యాప్ చేస్తుంది, అంటూ ప్రతిపక్ష పార్టీలు మాట్లాడుతున్నాయి. కర్ణాటకలో భారతీయ జనతా పార్టీ మాట్లాడుతుంది, కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఫోన్ ట్యాపింగ్ చేస్తుంది అని మాట్లాడుతుంది. ఆ మాటకు వస్తే రాధాకృష్ణ గారికి గుర్తు చేయదలుచుకున్నా, కేంద్ర ప్రభుత్వం పెగాసస్ అనే ఒక సాఫ్ట్వేర్ ని తీసుకొచ్చి, దేశంలోని మొత్తం ప్రముఖులకు సంబంధించిన ఫోన్లను అన్నింటిని వింటోంది, అని పార్లమెంట్ను ఓ 40-50 రోజుల పాటు స్తంభింప చేశాయి పార్టీలన్నీ. కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ నేతృత్వంలో. సుప్రీం కోర్టు జస్టిస్లకు సంబంధించిన ఫోన్లను, న్యాయవాదుల ఫోన్లను, జర్నలిస్టుల ఫోన్లను, అనేకమంది పొలిటీషియన్స్ ఫోన్లను, పెగాసస్ అనే ఒక సాఫ్ట్వేర్ ద్వారా కేంద్ర ప్రభుత్వం వింటోంది అని పార్లమెంట్లో చాలా పెద్ద గొడవ చూశాం. పెగాసస్ సాఫ్ట్వేర్ ద్వారా కేంద్ర ప్రభుత్వం ప్రతిపక్ష నాయకుల ఫోన్లు వింటోంది అంటూ జరిగిన ఆందోళనకి తెలుగుదేశం పార్టీ కూడా మద్దతు ఇచ్చింది. చంద్రబాబు నాయుడు గారు కూడా మోదీ ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారు అంటూ మాట్లాడారు. మోదీని అరెస్ట్ చేసి జైల్లో వేయాలా, ఎస్ రాధాకృష్ణ గారు చాలా కాలంగా వస్తున్న మాట కదా, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు మా ఫోన్లు ట్యాప్ చేస్తున్నారంటూ, ప్రభుత్వం పైన ఆరోపణ చేయడం అనేది చాలా కామన్ కానీ, బిఆర్ఎస్ ప్రభుత్వంపైన గతంలో చేసిన ఆరోపణలు ఏంటి అంటేచ హీరోయిన్ల ఫోన్లు టాప్ చేశారుచ బిజినెస్ మెన్ ఫోన్లని టాప్ చేసి మీరు మాకు డబ్బులు ఇస్తారా లేదా అని బెదిరించిచ వాళ్ళతో ఎలక్టోరల్ బాండ్ రాయించుకున్నారుచ ఇటువంటి అసంబద్ధమైన ఆరోపణలు ఉన్నాయి. ఈరోజు వరకు తెలంగాణ రాష్ట్రంలో ఏ హీరోయిన్ కూడా, నా ఫోన్లని గత ప్రభుత్వం ట్యాప్ చేసిందని పోలీసులకు ఒక కంప్లైంట్ ఇవ్వలేదు సరి కదా, మా పేర్లు వాడి మా ఫోటోలు వాడి దుష్ప్రచారం చేయొద్దు అంటూ పోలీసులను వేడుకున్న సెలబ్రిటీస్ చూశాం. పొలిటికల్ పార్టీలకు సంబంధించిన వాళ్ళు చేసే ఆరోపణ, దేశవ్యాప్తంగా చేసే ఆరోపణ కేంద్ర ప్రభుత్వం పైన ఉంది, ఆయ రాష్ట్రాల్లో ఉంది, వ్యక్తిగతంగా మా ఫోన్లు టాంపర్ చేశారు, అంటూ ఏ బిజినెస్ మన్ కంప్లైంట్ ఇవ్వలేదు, ఏ సెలబ్రిటీ కూడా కంప్లైంట్ ఇవ్వలేదు, కానీ మొత్తం రాసింది సెలబ్రిటీల ఫోన్లు టాప్ చేశారు, ఇంకేదో, ఇంకేదో చాలా అనైతికంగా రాస్తూ వచ్చారు. అనైతికంగా రాసిన వాళ్ళు, చేసిన క్రైం, చేసింది క్రైమా ఆరోపణలు ఎదుర్కుంటున్న వాళ్ళు చేసింది క్రైమా, ఒకసారి రాధాకృష్ణ గారు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మీ బ్రెయిన్ ఏదో కాస్త బ్యాలెన్స్ తప్పినట్టు కనపడుతుంది. వారం రోజుల వ్యవధిలోనే మీరు మాట్లాడిన దానికి, మీరు రాసిన దానికి, వారం రోజుల తర్వాత మీరు రాసిన దానికి, సంబంధం లేకుండా ఉంది. కెసిఆరే తెలంగాణ ఆత్మగౌరవం అంట, కీఆర్రే తెలంగాణ ఆత్మగౌరవం అని బిఆర్ఎస్ పార్టీ చెప్తుంది కెసిఆర్ తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బ తీశారంటూ బిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీలో మాట్లాడుకుంటాయి, పార్టీలుగా మాట్లాడుకుంటాయి కానీ, మీరు తెలంగాణ ఆత్మగౌరవం ఎవరికి ఉందో లేదో అని చెప్తే, తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ ఉద్యమాన్ని ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళు, తెలంగాణ ఉద్యమం గురించి చూసిన వాళ్ళు ఏమనుకుంటారో ఒకసారి ఆలోచన చేయండి. ఇక్కడ ఆయన అక్కసు ఇంకోటి వెళ్ళగక్కారు, ఏంటి అంటే, కూలీ మీడియా, సోషల్ మీడియాలో హడావుడి చేస్తుంది, కేసిఆర్ కి నోటీసులు ఇవ్వడం పట్ల అని ఓ జర్నలిస్ట్ గా సుదీర్ఘకాలం పనిచేసి మాట్లాడాల్సిన మాటలేనా అవి, స్థాయికి తగ్గ మాటలేనా అవి, సోషల్ మీడియా కూలీ మీడియా అయితే, మీరేం మీడియా, కూలి తీసుకుంటున్న శాటిలైట్ మీడియానా, కూలి తీసుకుంటున్న ప్రింట్ మీడియానా, సరిగ్గా వారం 10 రోజుల క్రితం వైజాగ్ లో మీకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం భూమి కేటాయించింది, అది మీరు చేస్తున్న సేవకు గాను, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన కూలియా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అఫీషియల్ గా మీకు భూమి రూపంలో కూలి ఇచ్చిందని అనుకోవాలా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మీ పవర్ ప్లాంట్ నుంచి పవర్ ని, కొంటోంది మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి కూలీ గా పని చేస్తున్నారు కాబట్టి, మీకు ఇచ్చిన కూలీగా దాన్ని చూడాలా, మాలాంటి వాళ్ళ ఎవరైనా మీ ఆర్టికల్స్ పైన మాట్లాడితేనే మాపైన కొంతమందిని ఉసిగొల్పి, మాట్లాడిస్తున్నారు కదా, వాళ్ళకి మీరు కూలీ ఇచ్చి మాట్లాడిస్తున్నారా, ఏ రాజకీయ పార్టీ ఈరోజు సోషల్ మీడియాని పెట్టుకొని నడుపుకోవట్లేదు, తెలుగుదేశం పార్టీకి సోషల్ మీడియా లేదా, ఈ దేశంలో ఏ పార్టీకి సోషల్ మీడియా లేదు, సోషల్ మీడియా కోసం ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేసుకొని, సోషల్ మీడియా రన్ చేసుకుంటున్నారు కదా. సోషల్ మీడియా హీట్ ఏదో బాగా తగులుతుంది, మీకు తట్టుకోలేకపోతున్నారు, ఆ బాధతోటే ఇటువంటి అసంబద్ధమైన, ఆధార రహితమైన మీ స్థాయికి తగని, మీ మైండ్ ఏదో బాలెన్స్ తప్పింది తరహా ప్రజలు అనుకునేలా ఆర్టికల్స్ రాస్తున్నారు. ఆంధ్రజ్యోతి కూలీ రాతలపై పూర్తి విశ్లేషణ..!


