డీఎస్సీ వాయిదా వేయండి మహాప్రభో అంటూ ఆంధ్రప్రదేశ్(Ap)లో నిరుద్యోగులు ఆందోళన చేస్తున్నరు.

డీఎస్సీ వాయిదా వేయండి మహాప్రభో అంటూ ఆంధ్రప్రదేశ్(Ap)లో నిరుద్యోగులు ఆందోళన చేస్తున్నరు. ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ అంశంపై రాజకీయపార్టీలు ప్రజాసంఘాలు, జర్నలిస్టుల కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. టెట్(TET)కు, డీఎస్సీ(DSC)కి సమయం ఇవ్వాలని కోరుతున్నారు. ప్రభుత్వం దానిని అడ్రెస్ చేయడానికి ఎందుకో ఆసక్తి చూపడం లేదు. టెట్ నిర్వహించకుండా డీఎస్సీ నోటిఫికేషన్ ఎలా ఇస్తారని ప్రశ్నిస్తున్నారు. గతంలో పేపర్ కఠినంగా ఉండడంతో టెట్ క్వాలిఫై కాలేకపోయారు. 50 శాతం మంది టెట్కు క్వాలిఫైకాలేకపోతున్నారు. ఏడేళ్ల తర్వాత డీఎస్సీ పడిందని ఈ పరీక్ష రాసి ఉద్యోగం సాధించాలని ఎంతో మంది ఆసక్తితో ఉన్నారన్నారు. ఎన్నికల ముందు టీడీపీ నేతల హామీలను నమ్మి కూటమికి ఓట్లు వేశామని నిరుద్యోగులు చెప్తున్నారు. మెగా డీఎస్సీ వస్తుందని లక్షలాది మంది ఎదురు చూశారు. కానీ టెట్కు, డీఎస్సీ 60 రోఉల సమయం ఉండాలనే నిబంధనను పాటించడం లేదని వారు వాపోతున్నారు. ఈ అంశంపై సీనియర్ జర్నలిస్ట్ 'YNR' విశ్లేషణ..
