నారా లోకేష్‌ తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, మంత్రిగా కొనసాగుతున్నారు. కూటమి సర్కార్‌లో ఎంత పవర్‌ ఫుల్‌గా ఉన్నారో అందరికీ తెలిసిందే.

నారా లోకేష్‌(Nara lokesh) తెలుగుదేశం పార్టీ(TDP) జాతీయ ప్రధాన కార్యదర్శిగా, మంత్రిగా కొనసాగుతున్నారు. కూటమి సర్కార్‌లో ఎంత పవర్‌ ఫుల్‌గా ఉన్నారో అందరికీ తెలిసిందే. ఎన్నికలకు ముందు నారా లోకేష్‌ యువగళం పేరుతో భారీ పాదయాత్ర నిర్వహించారు. పాదయాత్ర సందర్భంగా తమ నేతలపై దాడులకు పాల్పడుతున్న వైసీపీ నేతలు, అధికారుల పేర్లు రెడ్‌ బుక్‌లో రాసుకుంటున్నామని చెప్పారు. రెడ్‌బుక్‌ పేరుతో నారా లోకేష్‌ పాపులరయ్యారు. టీడీపీ కార్యకర్తల సంక్షేమాన్ని చూసే వ్యక్తిగా, వారి కోసం దశాబ్దానికి పైగా లోకేష్‌ పనిచేస్తున్నారు. అయితే ఈ మధ్య కాలంలో నారా లోకేష్‌ను నెంబర్‌ 2 పొజిషన్‌లోకి తెచ్చేందుకు మార్గం సుగుమం అయిందనే వార్తలు వస్తున్నాయి. రెండు నెలలకు ముందే ఆయనను డిప్యూటీ ముఖ్యమంత్రిగా చేస్తున్నారంటూ వార్తలు వచ్చాయి. తెలుగుదేశానికి సంబంధించిన అధికారిక మీడియా చానెల్స్‌లో ఆయన డిప్యూటీ సీఎం కానున్నారని వార్తలు వచ్చాయి. నారా లోకేష్‌ యుగం ఇక ప్రారంభం కానుందని వార్తలు రాశారు. మరికొందరు నేతలైతే డైరెక్టుగా చంద్రబాబు(Chandrababu) సమక్షంలోనే లోకేష్‌ను డిప్యూటీ సీఎం చేయాలంటూ డిమాండ్ చేశారు. దావోస్‌లో కూడా ఓ మంత్రి నేరుగా నారా లోకేష్‌ను డిప్యూటీ సీఎం అవుతారని మీడియాతో అన్నారు. కడప జిల్లాలో ఓ కార్యక్రమంలో చంద్రబాబు సమక్షంలో టీడీపీ నేత శ్రీనివాస్‌రెడ్డి లోకేష్‌ను డిప్యూటీ సీఎం చేయాలని కోరారు. ఆ తర్వాత ఇలాంటి వ్యాఖ్యలు ఎవరూ చేయకూడదని ప్రకటన చెప్పారు. దావోస్‌లో టీజీ భరత్‌ చెప్పిన తర్వాత ఆ అంశం పక్కకు పోయింది. ఈ అంశంపై సీనియర్‌ జర్నలిస్ట్ 'YNR' విశ్లేషణ..



ehatv

ehatv

Next Story