ఆంధ్రప్రదేశ్‌లో జగన్మోహన్‌రెడ్డి సర్కార్ పోయి, చంద్రబాబు సర్కార్‌ వచ్చి 12 నెలలు దాటింది.

ఆంధ్రప్రదేశ్‌లో జగన్మోహన్‌రెడ్డి సర్కార్ పోయి, చంద్రబాబు సర్కార్‌ వచ్చి 12 నెలలు దాటింది. ఈ 12 నెలల కాలంలో ప్రతిరోజు జగన్మోహన్‌రెడ్డి పేరు ప్రస్తావించకుండా చంద్రబాబు ప్రసంగం లేదు. అది ఆధ్యాత్మిక ప్రసంగమైనా, వ్యాపార ప్రసంగమైనా, రాజకీయపరమైన ప్రసంగమైనా, ఇంకే రకమైన ప్రసంగమైనా జగన్‌ పేరు తీయకుండా ఉండడం లేదు. జగన్మోహన్‌రెడ్డి పేరు లేకుండా ఆంధ్రప్రదేశ్‌లో పత్రికలు వార్తలు రాసిన రోజు లేదు. ప్రధాన మీడియాలో ప్రతీరోజూ జగన్‌ పేరు ఉండాల్సిందే. ఆంధ్రప్రదేశ్‌లో జగన్‌ తప్పు చేశాడు, అక్రమాలు చేశాడు, అవినీతి చేశాడు, అప్పలు చేశాడు అంటూ తెలుగుదేశం పార్టీకి చెందిన మీడియాలో ప్రతినిత్యం వార్తలు రాస్తూనే ఉన్నారు. జగన్‌ పేరు తీయకుండా నిద్ర కూడా పోవడం లేదు. ఏడాది కాలంగా జగన్మోహన్‌రెడ్డిపై నెగెటివ్‌ ప్రచారం మాత్రం ఆపడం లేదు. పైగా చంద్రబాబు జగన్మోహన్‌రెడ్డి మళ్లీ వస్తాడేమోనని వ్యాపారవేత్తలు భయపడుతున్నారని, జగన్‌ అనే భూతాన్ని భూస్థాపితం చేస్తానని, జగన్‌ అనే భూతాన్ని మళ్లీ రానివ్వనని ఏడాది కాలంగా చెప్తూ వస్తున్నాడు. జగన్‌ మళ్లీ రాడు అని చంద్రబాబు అయినా నమ్ముతున్నారా, జగన్‌ మళ్లీ ముఖ్యమంత్రి కాడు అని చంద్రబాబుకు నమ్మకం ఉందా, ఉంటే జగన్‌ మళ్లీ రాడు అని పదే పదే ఎందుకు చెప్పాల్సిన అవసరం ఏముంది..ఈ అంశంపై సీనియర్‌ జర్నలిస్ట్ 'YNR' విశ్లేషణ..

Updated On 26 Jun 2025 12:50 PM GMT
ehatv

ehatv

Next Story