వైఎస్‌ఆర్సీలో ఒక కొత్త జోష్‌ కనపడుతోంది. వచ్చే ఎన్నికల్లో గెలుస్తామన్న ధీమా జగన్‌లో కనపడుతోంది.

వైఎస్‌ఆర్సీలో ఒక కొత్త జోష్‌ కనపడుతోంది. వచ్చే ఎన్నికల్లో గెలుస్తామన్న ధీమా జగన్‌లో కనపడుతోంది. కార్యకర్త స్థాయి నుంచి అధినేత వరకు ఈ ఈ ధీమా స్పష్టంగా ఉంది. వైఎస్‌ఆర్సీపీ(Ysrcp)లో ప్రతీ కార్యకర్త ఈ విషయాన్ని బలంగా నమ్ముతున్నారు. దానికి కారణం సూపర్‌ సిక్స్(Super Six) అమలు కాలేకపోవడం. సూపర్‌ సిక్స్‌ను ఇప్పుడున్న ప్రభుత్వం అమలు చేయాలేదని ఆ పార్టీ క్యాడర్‌ నమ్ముతోంది. అమలు చేసినా రకరకాల టర్మ్స్‌ అండ్‌ కండీషన్స్‌ పెడుతుంది. దీని కారణంగా ఐదేళ్లలో ప్రభుత్వంపై విపరీతంగా పెరుగుతోందని వారు నమ్ముతున్నారు. అంతేకాకుండా ప్రజల్లో తనకున్న క్రేజ్‌ను చూసి కూడా జగన్‌ (Ys Jagan)మరింత ధీమాలో ఉన్నారు. గడిచిన ఆరు నెలలుగా వైఎస్‌ జగన్‌ ప్రజల్లోకి వెళ్తున్నారు. రకరకాల సమస్యల కారణంగా, రకరకలా కారణాలంతో ఆయన ప్రజల్లోకి వెళ్తున్నారు. ఆయన జనాల్లోకి వెళ్లినప్పడల్లా విపరీతంగా జనాలు వస్తున్నారు. జనాలను సమీకరిస్తున్నారా లేదా వారే వస్తున్నారో తెలియదు కానీ భారీగా జనాలు అయితే వస్తున్నారు. 175 స్థానాలు ఉన్న రాష్ట్రంలో 11 స్థానాలకే పరిమితమైన ఓ పార్టీ అధినేత ఎన్నికలైన ఏడాది తర్వాతే జనంలోకి వస్తున్నారు.. విపరీతమైన స్పందన కూడా వస్తుంది. ఏదైనా పార్టీ అధికారం కోల్పోతే ఒక రెండు, మూడేళ్లు సమయం తీసుకుంటారు. 2019లో టీడీపీ(TDP) కూడా జనంలోకి రావడానికి మూడేళ్లు పట్టింది. కరోనా పేరుతో ఆపార్టీ మూడేళ్ల తర్వాతనే బయటకు వచ్చింది. లోకేష్‌(Lokesh) యువగళం పాదయాత్ర తప్పితే ఆ పార్టీ పెద్దగా ప్రజల్లోకి వచ్చింది లేదు. ఈ స్థాయిలో జనం వస్తున్నారు కాబట్టి వచ్చే ఎన్నికల్లో తమదే అధికారం అని వైసీపీ (Ycp)అనుకుంటోంది. ఈ అంశంపై సీనియర్‌ జర్నలిస్ట్ 'YNR' విశ్లేషణ..



ehatv

ehatv

Next Story