ఆంధ్రప్రదేశ్లో రెండు ప్రధాన పార్టీలు తెలుగుదేశం పార్టీ(Tdp), వైఎస్ఆర్సీపీ(YSRCP) మధ్య ఎన్నికలకు ఇంకా నాలుగేళ్ల సమయం ఉన్నా ప్రతిరోజు హైఓల్టేజ్ వార్ నడుస్తోంది.

ఆంధ్రప్రదేశ్లో రెండు ప్రధాన పార్టీలు తెలుగుదేశం పార్టీ(Tdp), వైఎస్ఆర్సీపీ(YSRCP) మధ్య ఎన్నికలకు ఇంకా నాలుగేళ్ల సమయం ఉన్నా ప్రతిరోజు హైఓల్టేజ్ వార్ నడుస్తోంది. సోషల్ మీడియా వేదికగా లేదా వీధిపోరాటలతో డైరెక్ట్ వార్ నడుస్తోంది. ఆంధ్రప్రదేశ్ (AP)రాజకీయాలు ఎన్నికలు ముగిసిన తర్వాత చల్లబడి, ఎన్నికలకు కొన్ని రోజుల ముందు హీట్ ఉండదు. ప్రతిరోజూ రేపే ఎన్నిక జరగనుందా అనే విధంగా హీట్ను జనరేట్చేస్తున్నాయి. అరెస్టులు, జగన్(Ys Jagan) పర్యటనల సందర్భంగా అధికార పక్షంపై ప్రతిపక్షం, ప్రతిపక్షంపై అధికార పక్షం ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటున్నాయి. ఈ రెండు పార్టీల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు వస్తూనే ఉన్నాయి. అటువంటి సమయంలో వైఎస్ షర్మిల సడెన్గా దూరిపోతున్నారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా ఉన్న వైఎస్ షర్మిల(Ys Sharmila), ఏపీలో ఎన్డీఏ(NDA) కూటమి అధికారంలో ఉంది.. కూటమి సర్కార్ను విమర్శించకుండా వైఎస్ జగన్ టార్గెట్గా విమర్శలు చేస్తూ వస్తున్నారు. వైఎస్ జగన్తో వ్యక్తిగత విభేదాల కారణంగా ఆమె జగన్కు వ్యతిరేకంగా మాట్లాడుతూ వచ్చారు. జగన్ వ్యక్తిత్వం దెబ్బతినేలా వ్యాఖ్యానించారు. అది టీడీపీ వాడుకుంది. టీడీపీ తమకు అనుకూలంగా మార్చుకుంది. ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా ఆమె వైసీపీని లక్ష్యంగా పెట్టుకుని విమర్శిస్తున్నారు. అసలు ఎందుకు వైసీపీని షర్మిల టార్గెట్ చేస్తోంది. ఈ అంశంపై సీనియర్ జర్నలిస్ట్ 'YNR' విశ్లేషణ..!
